Hyderabad: సాగర్ చౌరస్తా TO ఉప్పల్ రయ్..రయ్.. మెరుగు పడిన ప్రజా రవాణా
ఎల్బీనగర్ కూడలి చుట్టూ..(ఉప్పల్ నుంచి సాగర్ చౌరస్తా వరకు) భారీగా రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు
హైదరాబాద్: ఎల్బీనగర్ కూడలి చుట్టూ..(ఉప్పల్ నుంచి సాగర్ చౌరస్తా వరకు) భారీగా రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు ఎల్బీనగర్ అండర్పాస్తో పాటు బైరామల్గూడ ఫ్లైఓవర్ను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీ పథకం కింద రూ.40కోట్ల వ్యయంతో ఎల్బీనగర్ అండర్పాస్, రూ.29కోట్లతో బైరామల్గూడ ఫ్లైఓవర్లను నిర్మించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ ఫ్రీ నగరంగా ఏర్పాటు చేసేందుకు ఎస్ఆర్డీపీ పథకంలో ఫ్లై ఓవర్లు, స్కై వేలు, మేజర్ కారిడార్లు, గ్రేడ్ సపరేటర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులు చేపట్టారు. అందులో భాగంగా ఎల్బీనగర్ కూడలి అత్యంత ప్రధానమైంది.
వరంగల్, నల్గొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు అండర్ పాస్, ఫ్లై ఓవర్ నిర్మాణాలను చేపట్టారు. ఎల్బీనగర్ కూడలి (ఆర్హెచ్ఎస్) ఎడమ వైపు రూ.40 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు అండర్ పాస్ 12.875 మీటర్ల వెడల్పు, 72.50 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లేన్ల యునీ డైరెక్షన్లో ఈ అండర్పాస్ నిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అరాంఘర్, మిధాని మీదుగా వచ్చే ట్రాఫిక్ నివారించేందుకు సుమారు రూ.29 కోట్ల వ్యయంతో బైరామల్గూడ (ఎల్హెచ్ఎస్) ఫ్లై ఓవర్ 780 మీటర్ల పొడవు, 400 మీటర్ల డక్ పోర్షన్, 380 ఆర్ఈవాల్, 12.50 మీటర్ల వెడల్పుతో 3లేన్లతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కామినేని కూడలిలోని రెండు పైవంతెనలు సేవలందిస్తున్నాయి. నాగోల్ కూడలిలో రెండు పైవంతెనల నిర్మాణం పురోగతిలో ఉంది. ఉప్పల్ కూడలి నుంచి నారపల్లి వరకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్) భారీ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తోంది. దానికి కొనసాగింపుగా జీహెచ్ఎంసీ కూడలి నుంచి రామంతాపూర్ వైపు ఓ పై వంతెనను, కూడలి నుంచి క్రికెట్ స్టేడియం మీదుగా సికింద్రాబాద్ వైపు మరో పై వంతెనను బల్దియా నిర్మించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. -
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
శ్రీరామ నవమి (Sri Rama Navami)ని పురస్కరించుకుని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్) వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గౌతమ్ గంభీర్ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్
-
గగనతలంలో ‘సూర్యతిలకం’ వీక్షించి.. మోదీ భావోద్వేగం
-
సీఎంపై రాయి దాడి ఘటనలో బొండా ఉమాను ఇరికించే కుట్ర: చంద్రబాబు
-
‘రాహుల్, ప్రియాంక అమూల్ బేబీలు’.. అస్సాం సీఎం హిమంత వ్యంగ్యాస్త్రాలు
-
అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం
-
మూడు నెలల్లో భారాస దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి