Crime News: మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో వీడని చిక్కుముడి
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను హ్యాక్ చేసిన కేసులో చిక్కుముడి వీడలేదు. ఇప్పటి వరకు ఆధారాలు లభించకపోవడంతో
హైదరాబాద్: ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను హ్యాక్ చేసిన కేసులో చిక్కుముడి వీడలేదు. ఇప్పటి వరకు ఆధారాలు లభించకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ హ్యాకింగ్ కేసు సవాలుగా మారింది. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన మూడు ఖాతాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకింగ్ రంగానికి హ్యాకింగ్ వల్ల ముప్పు ఉండటంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా మహేశ్ బ్యాంక్ ఘటనపై దృష్టిసారించాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నుంచి కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగం వివరాలు సేకరించింది.
కేంద్ర సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని సమన్వయం చేసుకుంటూ సైబర్ క్రైమ్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ఖాతాలకు నగదు బదిలీ కావడంపై మహేశ్ బ్యాంక్లో నిర్వహణ లోపాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇటీవల గంటల వ్యవధిలోనే సైబర్ కేటుగాళ్ల మహేశ్ బ్యాంకులో రూ.12.9 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో