Crime News: ఫాస్ట్‌ఫుడ్‌ లేదన్నాడని కత్తితో దాడి.. హైదరాబాద్‌లో ఘటన

ఫాస్ట్ ఫుడ్ అడిగితే లేదన్నాడని వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

Published : 16 Jan 2022 10:15 IST

హైదరాబాద్‌: ఫాస్ట్ ఫుడ్ అడిగితే లేదన్నాడని వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బిద్యాధర్ (32) అనే వ్యక్తి జీడిమెట్ల పరిధిలోని సుభాష్ నగర్ బస్టాప్ వద్ద ఏడాది నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అతని ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌ పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ డబ్బా నిర్వహిస్తున్నాడు. నిన్న రాత్రి 10.30 గంటలకు బిద్యాధర్ వద్దకు వెళ్లిన యాసిన్‌.. తనకు ఫాస్ట్ ఫుడ్ కావాల్సిందిగా అడిగాడు. రాత్రి అయినందున తాను షాపును మూసివేస్తున్నానని బిద్యాధర్‌ చెప్పాడు. దీంతో ఆవేశానికి లోనైన యాసిన్ 10 నిమిషాల తరువాత కత్తితో వచ్చి బిద్యాధర్ మెడ, ఛాతీలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బిద్యాధర్‌ని స్థానికులు షాపూర్ నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రకి తరలించారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు