Durgam cheruvu cable bridge: హద్దు మీరితే చర్య తప్పదు!
చేతిలో ద్విచక్ర వాహనం, విశాలమైన రోడ్డు ఉంటే యువత విన్యాసాలు చేస్తుంటారు
హైదరాబాద్: చేతిలో ద్విచక్ర వాహనం, విశాలమైన రోడ్డు ఉంటే యువత విన్యాసాలు చేస్తుంటారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫొటోలకు ఫోజులు ఇస్తూ తమకు ఎదురేలేదంటూ కాలర్ ఎరగేస్తారు. అయితే దుర్గం చెరువు తీగల వంతెనపై మాత్రం ఆ పప్పులుడకవు. వాహనం ఆగిందంటే చలాన్ తోపాటు సామాజిక మాధ్యమాల్లో మీమ్ పడటం ఖాయం.
హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర తీగల వంతెనపై ఓ వ్యక్తి రోడ్డు పైకి వచ్చి డాన్సులు చేశాడు. ఇంతలో సైబరాబాద్ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి గమనించిన పోలీసులు రోడ్డుపై పాదచారులు రావడం నిషేధమని హెచ్చరించారు. అయినా ఆ వ్యక్తి నృత్యం చేసి అక్కడి నుంచి జారుకున్నాడు.
వంతెనపై వాహనం నిలిపేందుకు అనుమతి లేకున్నా ఓ వ్యక్తి ఫొటో దిగడానికి బైక్ పార్క్ చేశాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని కంట్రోల్ రూం నుంచి అనౌన్స్మెంట్ రావడంతో భయపడిన ఆ వ్యక్తి ‘నువ్వు వద్దూ నీ ఫొటో వద్దూ’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తాజాగా మరికొంత మంది యువకులు హద్దుమీరి ప్రవర్తించారు. ద్విచక్రవాహనాలతో తీగల వంతెన మీదకు వచ్చిన ఆరుగురు బైకులతో విన్యాసాలు చేశారు. పోలీసులు హెచ్చరిస్తున్నా రోడ్డుకు అడ్డంగా ద్విచక్రవాహనాలు ఆపి హంగామా చేశారు. కంట్రోల్ రూం సమాచారంతో అక్కడికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. జరిమానా విధించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం