Telangana News: అలాంటి నేతలను ప్రజలు స్క్రాప్‌ కింద పరిగణించాలి: పువ్వాడ అజయ్‌

ఎన్నికల ముందు వచ్చి తర్వాత కనిపించనివారిని ప్రజలు నమ్మొద్దని.. అలాంటి నేతలను స్క్రాప్‌ కింద పరిగణించాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఖమ్మంలో కల్యాణలక్ష్మి, షాదీ

Published : 23 May 2022 15:03 IST

ఖమ్మం: ఎన్నికల ముందు వచ్చి తర్వాత కనిపించనివారిని ప్రజలు నమ్మొద్దని.. అలాంటి నేతలను స్క్రాప్‌ కింద పరిగణించాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఖమ్మంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ అనంతరం మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాలు నిరుపేదలకు ఏమీ చేయలేకపోయాయన్నారు. మహిళా నేతలం అని చెప్పుకునే వారు మహిళలకు ఎలాంటి లబ్ధిచేకూర్చలేదని విమర్శించారు. రచ్చబండలు పెట్టి మళ్లీ ప్రజలను కలిసేందుకు వస్తున్నారని ఆక్షేపించారు. ఉపయోగపడని నేతలకు సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పాలని పువ్వాడ అజయ్‌ ప్రజలు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని