Telangana : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచుతూ తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. గతంలో ఖరారు చేసిన తేదీల ప్రకారం జనవరి 29 వరకు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. దాన్ని ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది...

Published : 29 Jan 2022 02:13 IST

హైదరాబాద్‌ : పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచుతూ తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్ణయం తీసుకుంది. గతంలో ఖరారు చేసిన తేదీల ప్రకారం జనవరి 29 వరకు మాత్రమే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. దాన్ని ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. ఆలస్య రుముములతో మార్చి 14 వరకు చెల్లించే అవకాశమిచ్చింది. ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆ ప్రకారం మే 20వ తేదీ తర్వాత మొదలవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని