Telangana News: దేశం ఫస్ట్‌.. పార్టీ నెక్ట్స్.. ఫ్యామిలీ లాస్ట్‌.. అనేదే భాజపా నినాదం: తరుణ్‌చుగ్‌

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి భాజాపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని

Published : 24 May 2022 01:08 IST

హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి భాజాపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతల సమావేశంలో తరుణ్‌ చుగ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. దేశం ఫస్ట్‌.. పార్టీ నెక్ట్స్.. ఫ్యామిలీ లాస్ట్‌.. అనేదే భాజపా నినాదమని చెప్పారు.

‘‘రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేక వాతావరణం నెలకొంది. ఆయన పాలనపై ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు. ఇదే విషయాన్ని భాజపా కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలి. కేసీఆర్‌ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు. రైతులను గోస పెడుతున్నారు. 2023లో తెలంగాణలో డబుల్‌ ఇంజిన్ సర్కారు వస్తుంది. తెరాస కథ ముగుస్తుంది. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సుపరిపాలనపై ఈ నెల 30నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి.  తెరాస నుంచి భాజపాలోకి వచ్చేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పెద్ద ఎత్తున నాయకులు ఆసక్తి చూపుతున్నారు. కమిటీలు నియమించుకుని ఆయా నేతలను భాజపాలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని తరుణ్‌ చుగ్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని