Ts Inter results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా!
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వారిలో 5,90,327 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 63.32 శాతం, రెండో సంవత్సరంలో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదైందని మంత్రి తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు.
ఇంటర్ మొదటి సంవత్సరం..
❃ పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,64,892
❃ ఉత్తీర్ణత సాధించినవారు: 2,94,378
❃ ఉత్తీర్ణత శాతం: 63.32 శాతం
❃ పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,33,210
❃ ఉత్తీర్ణత సాధించినవారు: 1,68,692
❃ ఉత్తీర్ణత శాతం: 72.33
❃ పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,31,682
❃ ఉత్తీర్ణత సాధించినవారు: 1,25,686
❃ ఉత్తీర్ణత శాతం: 54.20 శాతం
ఇంటర్ రెండో సంవత్సరం..
❉ పరీక్షకు హాజరైన విద్యార్థులు: 4,63,370
❉ ఉత్తీర్ణత సాధించినవారు: 2,95,949
❉ ఉత్తీర్ణత శాతం: 67.82 శాతం
❉ పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 2,16,389
❉ ఉత్తీర్ణత సాధించినవారు: 1,64,172
❉ ఉత్తీర్ణత శాతం: 75.86
❉ పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 2,19,981
❉ ఉత్తీర్ణత సాధించినవారు: 1,31,777
❉ ఉత్తీర్ణత శాతం: 60 శాతం
ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు చివరినాటికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్ మొదటి ఏడాది ఫలితాల్లో మేడ్చల్ జిల్లా (76 శాతం), హనుమకొండ జిల్లా (74 శాతం) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. రెండో ఏడాది ఫలితాల్లో మేడ్చల్ జిల్లా (78 శాతం) మొదటి స్థానంలో ఉండగా, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (77శాతం) రెండో స్థానం దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు