Azadi ka Amrit Mahotsav: భారత్ సాధించాల్సింది ఎంతో ఉంది: దత్తాత్రేయ
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్లీలోని తెలంగాణ
దిల్లీ: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. దిల్లీలోని తెలంగాణ భవన్ అంబేడ్కర్ ఆడిటోరియంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘స్వతంత్ర భారతి నాట్య హారతి’ కార్యక్రమానికి దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శిఖరం ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దత్తా్త్రేయతో పాటు వివిధ రంగాల్లో సేవలు అందించిన మరో 14 మందికి శిఖరం ఆర్ట్ థియేటర్స్
సంస్థ సేవా భారతి-2021 జాతీయ అవార్డులు ప్రదానం చేసింది.
దత్తాత్రేయ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ చరిత్రలో భారత స్వాతంత్ర్య పోరాటం చాలా గొప్పది. అత్యుత్తమ సంగ్రామంగా చరిత్రలో నిలిచింది. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. 75 ఏళ్లలో ఎంతో సాధించిన భారత్.. ఇంకా సాధించాల్సింది మరెంతో ఉంది. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా సమాజంలో ఇప్పటికీ అసమానతలు ఉన్నాయి. వివిధ భాషలు, సంస్కృతులు ఉన్న భారతదేశాన్ని కాపాడుకోవాలంటే సామరస్యం, అభివృద్ధి ఎంతో కీలకమైనవి. ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడం చాలా సంతోషకరం. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. ఇవి సమకూరినట్లయితే అభివృద్ధిలో భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుంది. కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు చాలా గొప్పగా ఉన్నాయి. కొవిడ్ టీకాలు కనుగొని ఫార్మా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ తనదైన ముద్ర వేసుకుంది’’ అని దత్తాత్రేయ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య