Hyderabad News: ప్రగతిభవన్‌ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.

Updated : 18 Dec 2021 15:14 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌ వద్ద ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పంజాగుట్ట: ఇబ్రహీంపట్నం నాదర్‌గుల్‌ గ్రామానికి చెందిన ఎల్లేష్‌, అనురాధ భార్యాభర్తలు. వీరికి నాదర్‌గుల్‌లో ఐదెకరాల భూమి ఉంది. ఆ భూమిని అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పరిహారం రావాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నేటికీ పరిహారం అందకపోవడంతో ఇవాళ దంపతులిద్దరూ వారి ముగ్గురు పిల్లలను తీసుకొని ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. అక్కడ పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకొనేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పంజాగుట్ట పోలీసులు ఇది గమనించి వారిని అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని