Ts news: జూనియర్‌ కళాశాలలుగా 36 కస్తూర్బా విద్యాలయాలు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణలోని 36 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యాబోధన కూడా జరగనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 36 కేజీబీవీలను జూనియర్

Published : 21 Sep 2021 21:00 IST

హైదరాబాద్: తెలంగాణలోని 36 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యాబోధన కూడా జరగనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 36 కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాలయాల్లో 2021-22 నుంచి 11వ తరగతి, 2022-23 నుంచి 12వ తరగతి ప్రారంభం కానున్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన జరగనుంది.

ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, భద్రాచాలం, టేకుమట్ల, బీబీపేట, రఘునాథపాలెం, చింతలమానెపల్లి, కెరమెరి, రెబ్బెన, సిర్పూర్-యూ, గంగారం, జైపూర్, పెంట్లవెల్లి, శెట్టిపాలెం, కృష్ణ, నర్సాపూర్-జీ, అంతర్గాం, సిరిసిల్ల, మద్దిరాల, అమరచింత, ఐనవోలు, అడ్డగూడురులోని కేజీబీవీల్లో 40 సీట్ల చొప్పున ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. అలాగే బూర్గంపహాడ్, పల్మెల, భూపాలపల్లి, మహాముత్తారం, మెుగుళ్లపల్లి, రేగొండ, సిర్పూర్-టీ, మాణిక్యాపూర్, గండీఢ్‌, మహమ్మదాబాద్, ములుగు, తాడ్వాయి, మహేశ్వరం, కొందుర్గు, సిద్దిపేట అర్బన్ లోని కస్తూర్బా విద్యాలయాల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ప్రారంభం అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని