Teenmaar Mallanna: సైబర్‌ క్రైం పోలీసుల కస్టడీలోకి తీన్మార్‌ మల్లన్న

ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్‌ నిర్వాహకుడు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ను

Published : 09 Sep 2021 11:18 IST

హైదరాబాద్‌: ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్‌ నిర్వాహకుడు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ను సైబర్‌ క్రైం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మల్లన్నను ఒక్కరోజు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా.. ధర్మాసనం ఆ మేరకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఆయనను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ప్రశ్నించనున్నారు. డబ్బుల కోసం బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు గత నెల 27న మల్లన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఈ నెల 9 వరకు రిమాండ్‌ విధించారు. అప్పటి నుంచి ఆయన చంచలగూడ జైలులో ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని