Crime News: భెల్‌ టౌన్‌షిప్‌ తపాలా కార్యాలయంలో రూ.33 లక్షలు చోరీ

భెల్‌ టౌన్‌షిప్‌లోని తపాలా కార్యాలయంలో  చోరీ జరిగింది. దుండగులు లాకర్‌ను పగలగొట్టి రూ.33 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అయితే తపాలా కార్యాలయంలో...

Updated : 14 Feb 2022 04:49 IST

సంగారెడ్డి: భెల్‌ టౌన్‌షిప్‌లోని తపాలా కార్యాలయంలో  చోరీ జరిగింది. దుండగులు లాకర్‌ను పగలగొట్టి రూ.33 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అయితే తపాలా కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడిన అనంతరం మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. చోరీ ఘటనను అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు దుండగులు యత్నించినట్లుగా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని