Nalgonda: రథం తరలిస్తుండగా.. విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురి మృతి

నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రామాలయంలో

Updated : 28 May 2022 16:00 IST

నాంపల్లి: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రామాలయంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. రథం తరలిస్తుండగా.. విద్యుత్‌ తీగలు తగిలి ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామ శివారులో ఉన్న రామాలయంలో ఇటీవల ఉత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. ఇనుప రథం కావడంతో వర్షానికి తుప్పు పడుతుందనే భావనతో శనివారం ఆ రథాన్ని రథశాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్తు తీగలకు రథం తాకింది. దీంతో విద్యుదాఘాతంతో కేతపల్లికి చెందిన రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహన్(36)‌, గుర్రంపూడ్‌ మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు(26) అక్కడికక్కడే మృతి చెందారు. కేతపల్లికి చెందిన మరోవ్యక్తి రాజబోయిన వెంకటయ్యకు తీవ్రగాయాలు కావడంతో 108లో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై రజనీకర్‌ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని