Telangana News: భద్రాచలం పుష్కర్‌ఘాట్‌లో ముగ్గురు గల్లంతు

స్నానానికి గోదావరిలో దిగి ముగ్గురు గల్లంతైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర్‌ఘాట్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

Updated : 20 May 2022 18:57 IST

బూర్గంపాడు: స్నానానికి గోదావరిలో దిగి ముగ్గురు గల్లంతైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె పుష్కర్‌ఘాట్‌ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండల కేంద్రానికి చెందిన వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆటోలో భద్రాచలం వచ్చారు. పుష్కర్‌ ఘాట్‌ సమీపంలో స్నానం చేసేందుకు నదిలో దిగారు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌, వివాహిత, ఆమె ఇద్దరు కుమారులు నదిలో గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు గల్లంతైన ఇద్దరు పిల్లల్లో ఒకరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానికులు పడవల సాయంతో గాలింపు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని