TS News: ఓపిక నశిస్తే పోరాటానికి దిగాల్సి వస్తుంది: కేటీఆర్
చేనేత కార్మికుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు
సిరిసిల్ల: చేనేత కార్మికుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఏడున్నరేళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నా మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కొవిడ్ వ్యాప్తి నివారణ, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలపై సిరిసిల్ల కలెక్టరేట్లో సమీక్ష తర్వాత మాట్లాడిన కేటీఆర్.. తాజాగా ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లోనైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసినట్టు తెలిపారు. ఆ లేఖను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు కూడా పంపిస్తున్నామని, రాజకీయాలు మాని.. రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని కేటీఆర్ హితవు పలికారు. ఓపిక నశిస్తే పోరాటానికి కూడా దిగాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..