TSPSC Jobs: ఉద్యోగాల భర్తీ విధానంపై ఉత్తర్వులు.. పరీక్షా విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం
Tspsc jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విధానంపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. గ్రూప్-1 పోస్టులకు 900, గ్రూప్-2 పోస్టులకు 600 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే గ్రూప్-3లోని 8 రకాల పోస్టులకు 450 మార్కులతో రాత పరీక్ష జరుగుతుంది. గ్రూప్-4లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహంచనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
గ్రూప్-1 మెయిన్స్కు మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాటే గ్రూప్స్ విభాగంలో భర్తీ కానీ ఇతర ఉద్యోగాలకు ప్రత్యేక పరీక్ష విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
గ్రూప్స్తో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, సూపర్వైజర్, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్, సీనియర్ రిపోర్టర్, ఇంగ్లీష్ రిపోర్టర్ పోస్టులకు సంబంధించి పరీక్షా విధానాలను ప్రభుత్వం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం