Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లే ముందు ఆయనకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా సోకింది. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లే ముందు ఆయనకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వెంకయ్యకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు వారంపాటు ఉపరాష్ట్రపతి స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు. 2020 సెప్టెంబర్లో తొలిసారిగా ఉపరాష్ట్రపతికి కరోనా సోకింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.