Hyderbad News: శంషాబాద్‌లో కారు బీభత్సం.. మద్యం మత్తులో నడిపిన యువతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ యువతి మద్యం మత్తులో కారు నడిపి రోడ్డుపై వెళుతున్న వారిని ఢీకొట్టింది.

Updated : 27 Jan 2022 16:01 IST


 

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువతి రోడ్డుపై వెళుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారును స్థానికులు అడ్డుకోవడంతో వారితో యువతి, వాహనంలో ఉన్న మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువతి, ఆమెతో ఉన్న వ్యక్తిని పీఎస్‌కు తరలించారు. కారులో ఉన్న వారు మద్యం తాగినట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో తేలిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు