K Keshava Rao: సమాఖ్య స్ఫూర్తికి తూట్లు
భారత్ అన్న ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఆర్థికంగా మనం విడిపోయినట్లు బుధవారం ఒక నాయకుడు చెప్పారు. లౌకికంగా, సాంస్కృతికంగానూ దేశంలో విభజన వచ్చింది. మతాల మధ్య విద్వేషాలు సృష్టించడం దేశ మూల సిద్ధాంతానికి వ్యతిరేకం.
దక్షిణాది రాష్ట్రాలపై నిర్లక్ష్యం
ప్రమాదంలో దేశం
రాష్ట్ర జాబితాలోని అంశాలపై జోక్యం
కేసీఆర్ ‘కొత్త రాజ్యాంగ’ సూచన అందుకే
రాజ్యసభలో కేంద్రంపై కేకే ధ్వజం
ఈ ప్రభుత్వానికి మద్దతివ్వబోమని స్పష్టీకరణ
భారత్ అన్న ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఆర్థికంగా మనం విడిపోయినట్లు బుధవారం ఒక నాయకుడు చెప్పారు. లౌకికంగా, సాంస్కృతికంగానూ దేశంలో విభజన వచ్చింది. మతాల మధ్య విద్వేషాలు సృష్టించడం దేశ మూల సిద్ధాంతానికి వ్యతిరేకం.
భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకిక భారతీయత, అతివాద హిందుత్వం అన్న అంశాలు పదునెక్కాయి. ఈ రెండు వర్గాల మధ్య వైరుధ్యం ప్రజా పునరేకీకరణకు పునాదిగా మారుతోంది. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగి మన మెదళ్లను కలుషితం చేస్తే రెండు దేశాలను చూడాల్సి వస్తుంది.
ఈనాడు, దిల్లీ: ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ మూల సూత్రాలకు తీవ్ర ముప్పు ఏర్పడిందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు పేర్కొన్నారు. విద్వేషపూరిత రాజకీయాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆవేశంగా మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర విస్మరణకు గురవుతున్నాయని ఆరోపించారు. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు బాగా ఆలోచించి కొత్త రాజ్యాంగం తీసుకురావాలన్న చర్చను దేశం ముందుపెట్టారని ఆయన పేర్కొన్నారు’’. ఈ ఎన్డీయే ప్రభుత్వ హయాంలో విద్వేషపూరిత ప్రసంగాలు 1,333% మేర పెరిగినట్లు టీవీల సర్వేల్లో వెల్లడైంది. హిందీ అంత సరళంగా అర్థంకానందున ఇంగ్లిష్లో సమాధానం చెప్పాలని ఉదయం సభలో ఓ సభ్యుడిని కోరితే.. కార్మికశాఖ మంత్రి మాత్రం తాము హిందీ ఒక్కటే మాట్లాడతామని బదులిచ్చారు. ఇలాంటి వైఖరి పోవాలి. దక్షిణాది రాష్ట్రాల్లో చాలామందికి ఈ భాష అర్థమేకాదు. వారితో కలుపుగోలుకు ప్రయత్నించాలి.
మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి
ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో చూడాలి. మీరు రాష్ట్రాల అధికారాలు లాగేసుకోవడానికే సమాఖ్యవ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకూ మద్దతిచ్చిన మేం ఇక భవిష్యత్తులో ఆ పని చేయకూడదని నిర్ణయించాం. మాలో అంతటి మార్పు ఎందుకు వచ్చిందో మీ అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. పౌరసత్వ చట్టాన్ని మార్చడం ద్వారా రాజ్యాంగ లౌకిక స్ఫూర్తిని కేంద్రం విధ్వంసం చేసింది. సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లుల ద్వారా మతతత్వాన్ని పెంచిపోషించాలని చూసింది. త్వరలో తీసుకురాబోయే విద్యుత్తు చట్టసవరణ బిల్లుతో ప్రైవేటు వారు పంపిణీ రంగంలోకి వస్తారు. లాభాలొచ్చే ఏరియాలు వారి చేతుల్లోకి వెళ్తాయి. మారుమూల ప్రాంతాలకు కరెంటు ఇచ్చే బాధ్యత మాత్రం ప్రభుత్వంపై పడుతుంది. మేం రైతులకు 24 గంటలూ ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం. ఈ బిల్లు కారణంగా ప్రతి మోటారుకు మీటరు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల రైతుల మెడపై కత్తి వేలాడదీసినట్లవుతుంది.
రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయంలో జోక్యం
వ్యవసాయ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందన్న రాజ్యాంగ సూత్రాన్ని విస్మరించి కేంద్రం ఏకపక్షంగా సాగు చట్టాలు తెచ్చింది. 14 నెలలు ఆందోళన చేసి 700 మందికి పైగా రైతులు చనిపోవడానికి కారణమైంది. రాష్ట్రపతి ప్రసంగంలో దాని గురించి ప్రస్తావించలేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెప్పినా చట్టబద్ధతేమీ కల్పించలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ గతంలో చెప్పారు. కానీ సాగు ఖర్చులు రెండింతలయ్యాయి. ప్రస్తుత వ్యవసాయ వృద్ధిరేటు 3.9%. అన్నదాతల ఆదాయం రెట్టింపు కావాలంటే ఇది 12-14% నమోదుకావాలి. దేశం మొత్తం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. మీ హయాంలో రాజ్యాంగ మూల సూత్రాలైన లౌకికతత్వం, గవర్నర్ కార్యాలయాలు, రాష్ట్ర పరిధిలోని అంశాలు ప్రమాదంలో పడిపోయాయి. ఇప్పటికే మనం 105 రాజ్యాంగ సవరణలు చేసినా సంతృప్తికరంగా లేదు. అందువల్ల రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనను కేసీఆర్ దేశం ముందు చర్చకు పెట్టారు’’ అని కేశవరావు పేర్కొన్నారు.
వనరుల పంపిణీలో దక్షిణాదికి అన్యాయం
ఈ ప్రభుత్వ పాలనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. పన్ను వాటా పంపిణీయే ఉదాహరణ. జనాభా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పాపానికి అధిక కోత పెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.28 వేల కోట్లకు పైగా గ్రాంట్ వస్తుందని ఆశిస్తే వచ్చింది రూ.5,155 కోట్లే. కేంద్ర ఖజానాకు అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ. కానీ ఈ ప్రాంతానికి మీ పాలనలో ఒక్క పెద్ద సంస్థ కూడా రాలేదు. విభజన హామీలనూ పట్టించుకోలేదు.
కేసీఆర్ ప్రతిపాదన భాజపాకు మేలుచేస్తుంది: ఖర్గే
కేసీఆర్ చేసిన కొత్త రాజ్యాంగ ప్రతిపాదనను రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు. ఆ విషయాన్ని కేశవరావుకు సభలో స్పష్టంచేశారు. ‘‘మీరు రాజ్యాంగం మార్పు గురించి మాట్లాడితే దాన్ని వ్యతిరేకించేవారిలో మేం ముందుంటాం. మీరు సవరణలు సూచించవచ్చు తప్పితే మార్చాలనడం తప్పు. అధికారంలో ఉన్న వారు ఎప్పటి నుంచో ఆ పని చేయాలనే కోరుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ వారూ అదే మాట్లాడుతున్నారు. మీ వాదన వారికి మేలు చేకూరుస్తుంది’ అని మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.