Telangana Budget: సంక్షేమమే మంత్రం
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే రూ. 35,000 కోట్ల మేర బడ్జెట్ పరిమాణాన్ని పెంచనుంది. సొంత పన్నుల రాబడిలో వృద్ధిరేటును 20 శాతంగా అంచనా
నేడేే రాష్ట్ర బడ్జెట్
రూ. 2.70 లక్షల కోట్ల పద్దు?
దళితబంధుకు రూ. 20,000 కోట్లు!
సొంత రాబడులపైనే ధీమా
వృద్ధిరేటు ఆలంబనగా ముందుకు
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్కు రంగం సిద్ధం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.70 లక్షల కోట్ల మేర బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరోనా పరిస్థితుల నుంచి బయటపడి రాష్ట్ర వృద్ధిరేటు బాగా పెరగడంతో గత ఏడాది కంటే రూ. 35,000 కోట్ల మేర బడ్జెట్ పరిమాణాన్ని పెంచనుంది. సొంత పన్నుల రాబడిలో వృద్ధిరేటును 20 శాతంగా అంచనా వేస్తున్న సర్కారు పన్నేతర రాబడి, రుణాలపై ధీమాతో భారీ అంచనాలను రూపొందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం స్పష్టం చేయనుంది. వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నందున ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఎన్నికల బడ్జెట్గానే భావించి కసరత్తు చేసినట్లు సమాచారం.. సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట దక్కనుంది. దళితబంధుకు రూ. 20,000 కోట్లు, రైతుబంధుకు రూ. 15,000 కోట్ల మేర కేటాయించనున్నట్లు తెలిసింది. ఆసరాకు గతం కంటే రూ. 3000 కోట్లు పెరిగినట్లు సమాచారం. పథకాల వ్యయం రూ. 1.5 లక్షల కోట్లను దాటనుండగా నిర్వహణ వ్యయం రూ. 1.10 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా.
ప్రాధాన్య పథకాలకు పెద్దపీట
రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, విద్యుత్ సబ్సిడీ, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు పెరగనున్నాయి. హైదరాబాద్ అభివృద్ధికి, జలమండలికి నిధులను పెంచనున్నారు. పరిశ్రమలకు, ఆర్టీసీకి తోడ్పాటు కొనసాగనుంది. కొత్త ఉద్యోగాలపై ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వనుంది. ఆసరాకు రూ. 14,000 కోట్ల మేర కేటాయింపులు దక్కనున్నాయి. విద్యుత్ సబ్సిడీలకు 11,000 కోట్లకు పైగా కేటాయించనుండగా రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలకు నిధులు పెరగనున్నాయి. వెనుకబడిన తరగతుల ఫెడరేషన్లకు ప్రత్యేక కేటాయింపులపై ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది.
సొంత రాబడుల దన్ను
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడి దాదాపు అంచనాల మేరకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆ అంచనాలను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం రూ. 1.06 లక్షల కోట్లు ఉన్న పన్నుల రాబడి అంచనాలను వచ్చే ఏడాది 20 శాతం పెంచినట్లు సమాచారం. జీఎస్టీ, అమ్మకం పన్ను, రిజిస్ట్రేషన్ల రాబడి పైనా ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు ఈసారి 19.10 శాతంగా నమోదు కావడంతో ఎఫ్ఆర్బీఎం పరిధిలో రుణాలను పెంచుకోనుంది. కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే తగ్గాయి.. భూముల అమ్మకం ద్వారా రాబడిని లక్ష్యంగా చేసుకుని పన్నేతర రాబడి అంచనాలు ఈసారి కూడా రూ. 30,000 కోట్ల కంటే ఎక్కువగా ఉండనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం
రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. -
గల్ఫ్ కార్మికులకు బోర్డు
గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది. -
తెలంగాణ వైపు ఏనుగుల మంద!
మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
అసామాన్య అనన్య
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
కేసుల వివరాలు అందించిన పోలీసులు
భాజపా తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా
ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే. -
ప్రచార రథంపై చెప్పుల దండ
ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. -
18 నుంచి సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-దానాపూర్ల మధ్య ఏప్రిల్, మే నెలల్లో అన్రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలోకి భారీగా చేరికలు
-
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?
-
‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించిన ఆప్
-
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
-
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
-
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్