Ukraine Crisis: శరణార్థులపై వంకర బుద్ధి
యుద్ధ భీతితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... పొరుగు దేశాలకు చేరుతున్న ఉక్రెయిన్ చిన్నారులు, బాలికలు, మహిళలపై మృగాళ్లు కన్నేస్తున్నారు. ఆశ్రయం పేరుతో వారిని లొంగదీసుకుని, ఆపై ‘వంకర బుద్ధి’ ప్రదర్శిస్తున్నారు. రష్యా సైనిక చర్యతో
ఆశ్రయం, ఉపాధి కల్పిస్తామంటూ బాలికలు, యువతులకు వల
కొన్నిచోట్ల కేవలం మహిళలకే వసతి
వీరికి లైంగిక దాడుల ముప్పు
ఉక్రెయిన్ నుంచి వచ్చినవారికి తప్పని అగచాట్లు
ఐరాస బృందం పరిశీలనతో వెలుగులోకి...
సిరెట్: యుద్ధ భీతితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... పొరుగు దేశాలకు చేరుతున్న ఉక్రెయిన్ చిన్నారులు, బాలికలు, మహిళలపై మృగాళ్లు కన్నేస్తున్నారు. ఆశ్రయం పేరుతో వారిని లొంగదీసుకుని, ఆపై ‘వంకర బుద్ధి’ ప్రదర్శిస్తున్నారు. రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ నుంచి చాలామంది పోలండ్, రొమేనియా, హంగరీ, మాల్డోవా, స్లొవేకియా తదితర దేశాలకు వెళ్లారు. అయితే, పలువురు వ్యక్తులు, వాలంటీర్లు వారికి ఆహ్వానం పలుకుతున్నారు. ఉచితంగా ఆహారం, రవాణా, వసతి సదుపాయాలు కల్పిస్తూ... ఉపాధి అవకాశాలు పొందడానికి తోడ్పడుతున్నారు. కానీ, వీరిలో కొందరి ఉద్దేశాలు వేరు! కొత్త ప్రదేశంలో, భాష తెలియని చోట, ఏంచేయాలో తెలియక, భవిష్యత్తును వెతుక్కునే క్రమంలో- శరణార్థుల్లోని చాలామంది మహిళలు, బాలికలు, చిన్నారులు... స్థానికులను నమ్ముతున్నారు. మరో దారిలేక వారు చెప్పినట్టు చేస్తున్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని అత్యాచారాలు జరుగుతున్నట్టు కొన్ని ఉదంతాలు తాజాగా వెలుగుచూశాయి. పోలండ్కు వచ్చిన 19 ఏళ్ల బాలికను స్థానికుడైన 49 ఏళ్ల వ్యక్తి ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికి లొంగదీసుకున్నాడు. అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే నిందితుడికి 12 ఏళ్ల జైలుశిక్ష తప్పదని అధికారులు పేర్కొన్నారు. ఉపాధి కల్పిస్తామంటూ 16 ఏళ్ల బాలికను మరో వ్యక్తి మభ్యపెట్టాడు. మెడికా సరిహద్దులో ఓ వ్యక్తి కేవలం మహిళలకు, పిల్లలకు మాత్రమే ఆశ్రయం కల్పిస్తుండం తాజాగా వెలుగుచూసింది. పోలీసులు ప్రశ్నించడంతో నిర్వాహకులు కట్టుకథలు చెప్పారు. ఈ ఘటనలతో శరణార్థుల భద్రత, ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాలికలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మానవ అక్రమ రవాణాదారులు రెచ్చిపోయే ప్రమాదముందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
పరిశీలనతో వెలుగులోకి...
ఐరాస హైకమిషనర్ ఫర్ రెఫ్యుజీ (యూఎన్హెచ్సీఆర్) గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ జాంగ్ విలియమ్స్ నేతృత్వంలోని బృందం ఇటీవల రొమేనియా, పోలండ్, మాల్డోవా సరిహద్దుల్లోని మానవతా శిబిరాలను సందర్శించింది. చాలా శిబిరాల్లోని శరణార్థులంతా మహిళలు, చిన్నారులే ఉంటున్నట్టు తేలింది. వీరు లైంగిక దాడులకు, అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదముందని ఐరాస బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ నుంచి 10 లక్షల మంది చిన్నారులు సహా 25 లక్షల మంది ఆ దేశాన్ని వీడినట్టు యూఎన్హెచ్సీఆర్ ప్రాథమికంగా అంచనా వేసింది.
చేతిలో చిల్లిగవ్వలేక...
భారీగా శరణార్థులు వస్తుండటం వల్ల వారిపై లైంగిక దాడులు, మనుషుల అక్రమరవాణా ముప్పు ఎక్కువగా ఉండొచ్చని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే హ్యూమన్ ట్రాఫికింగ్ ఫౌండేషన్ డైరెక్టర్ టమారా బార్నెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘శరణార్థుల చేతిలో చిల్లిగవ్వ ఉండదు. తక్షణ సాయం కోసం ఎవరో ఒకరిపై ఆధారపడాలి. బతకడం కోసం ఏదన్నా చేయక తప్పని పరిస్థితులు ఉంటాయి. వారి బలహీనతలను వంకర బుద్ధితో సొమ్ము చేసుకునేవారు, లైంగిక దోపిడీకి పాల్పడేవారు, వారిని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించేవారు ఉంటారు. చాలామంది వాలంటీర్లు బాలికలు, మహిళలను తమ ఇళ్లలోకి ఆహ్వానించడం చూస్తున్నప్పుడు నా బుర్రలో ఇలాంటి ఆందోళనలే రేకెత్తాయి’’ అని ఆమె పేర్కొన్నారు.
అర్థమయ్యేలా హెచ్చరికలు..
తాజా పరిణామాలతో చాలాచోట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిద్రపోయేందుకు వసతి కల్పిస్తామని, రాత్రి వచ్చి పడుకోవచ్చని ఎవరైనా చెబితే నమ్మవద్దంటూ బెర్లిన్లోని పోలీసులు ఉక్రెయిన్, రష్యన్ బాషల్లో శరణార్థులను హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. లైంగిక దాడులకు పాల్పడేవారిని పట్టుకునేందుకు పోలండ్, రొమేనియా పోలీసు అధికారులు సాధారణ దుస్తుల్లో తిరుగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్