
Air India: ప్రభుత్వానికి ఎయిరిండియా టాటా
విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం గురువారం టాటా గ్రూప్నకు అధికారికంగా అప్పగించింది. దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్ ఆధీనంలోకి రావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ‘ఎయిరిండియాను టాటా సన్స్ అనుబంధ కంపెనీ అయిన టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించాం. ఇక నుంచి ఆ సంస్థే యజమాని’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ సందర్భంగా తెలిపారు. 1932లో టాటా గ్రూప్ ఎయిరిండియాను స్థాపించగా.. స్వాతంత్య్రం వచ్చాక 1953లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సంస్థను జాతీయీకరించారు. సుమారు 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా సొంతగూటికి చేరినట్లయ్యింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.