Azadi Ka Amrit Mahotsav: యువ బాంబు పుట్టిన వేళ..!
జాతీయోద్యమంలో తిలక్ నుంచి బోస్ దాకా ఎంతో మంది విప్లవ యోధులు! వారందరిలో ప్రత్యేకమైన పేరు ఖుదీరాం బోస్.
జాతీయోద్యమంలో తిలక్ నుంచి బోస్ దాకా ఎంతో మంది విప్లవ యోధులు! వారందరిలో ప్రత్యేకమైన పేరు ఖుదీరాం బోస్.
పుట్టిందే దేశం కోసమన్నట్లుగా... మీసాలు రాని వయసులోనే బ్రిటిష్ గుండెల్లో ‘బాంబు’లు పేల్చిన ధీరుడు... చిరునవ్వుతో ఉరి కొయ్యకు వేలాడిన దేశభక్తుడు... మనం మరచిన తొలి భగత్సింహుడు - ఖుదీరాం.
బెంగాల్లోని మేదినీపుర్ ప్రాంతంలో 1889 డిసెంబరు 3న ఖుదీరాం జన్మించేనాటికి ఆయన తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో తహసీల్దార్! ముగ్గురు కుమార్తెల తర్వాత పుట్టిన కొడుకు. అప్పటికే ఇద్దరు కుమారులు పుట్టి చనిపోయారు. ఈ పిల్లవాడిని కాపాడుకోవటం కోసం స్థానిక సంప్రదాయాల ప్రకారం మూడు దోసిళ్ల బియ్యం (దీన్ని ఖుద్ అనేవారు) తీసుకొని పెద్దకూతురుకు అమ్మారు. అలా ఆ బాలుడి పేరు ఖుదీరాంగా స్థిరపడింది. కానీ దురదృష్టవశాత్తు ఆరో ఏటనే తల్లిని, ఏడో ఏట తండ్రిని కోల్పోవటంతో అక్కయ్య దగ్గరే తను పెరగాల్సి వచ్చింది. హామిల్టన్ హైస్కూల్లో చదువు. 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను విభజించటంతో ఆ ఉద్యమ ప్రభావం అందరిపైనా పడింది. అరబింద్ఘోష్, సిస్టర్ నివేదితలు తమ ప్రాంతానికి వచ్చి ఇచ్చిన ప్రసంగాలతో ఖుదీరాం ఉత్తేజితుడయ్యారు. 15వ ఏటనే... అరబిందో సారథ్యంలోని విప్లవసంస్థ అనుశీలన్ సమితిలో చేరారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచినందుకు అరెస్టు చేశారు కూడా. మీసాలు రాకుండానే చెరసాలకు వెళ్లి వచ్చిన ఖుదీరాం బాంబుల తయారీ నేర్చుకున్నారు.
ఆ సమయంలో కోల్కతాలో మేజిస్ట్రేట్గా పనిచేసిన డగ్లస్ కింగ్స్ఫోర్డ్... భారత స్వాతంత్య్ర సమరయోధుల పట్ల క్రూరంగా స్పందించేవాడు. కఠినమైన శిక్షలతో అణచివేసేవాడు. ఓసారి పోలీసుల దమనకాండను నిరసిస్తూ యువకులు కొందరు కోర్టు బయట ఆందోళన చేశారు. వారిలోని సుశీల్సేన్కు 15 కొరడా దెబ్బల శిక్ష విధించాడు కింగ్స్ఫోర్డ్. తోలు తేలిపోయేలా సుశీల్ను కొట్టారు. ప్రతి దెబ్బకూ వందేమాతరమంటూ నినదించాడు సుశీల్. ఇదంతా చూసిన విప్లవకారులు ఎలాగైనా కింగ్స్ఫోర్డ్పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. దీన్ని పసిగట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను ముజఫర్పుర్కు బదిలీ చేసింది. కానీ అనుశీలన్ సమితి వదల్లేదు.
ప్రఫుల్ల కుమార్ చాకి, ఖుదీరాం బోస్లు ముజఫర్పుర్ చేరుకున్నారు. అక్కడే ధర్మశాలలో ఉండి... కింగ్స్ఫోర్డ్ రాకపోకలు, ఆనుపానులపై ఆరాతీశారు. 1908 ఏప్రిల్ 29న రాత్రి 8.30కి... క్లబ్ నుంచి బయటకు రాగానే ఆయన బగ్గీపై బాంబువేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. అనుకున్నట్లే.. యూరోపియన్ క్లబ్ గేట్ దగ్గరకు బగ్గీ రాగానే... ఖుదీరాం ముందుకు దూకి బాంబు వేశాడు. భారీ విస్ఫోటనంతో బగ్గీ కాలిపోయింది. లక్ష్యం సాధించామనే సంతృప్తితో ప్రఫుల్ల, ఖుదీరాం చీకట్లో చెరోదారిన వెళ్లిపోయారు. బాంబు పేలింది... ఇద్దరు చనిపోయారు. కానీ కింగ్స్ఫోర్డ్ కాదు. క్లబ్లో బ్రిడ్జ్ ఆడటానికి వచ్చిన కింగ్స్ఫోర్డ్ కుటుంబ స్నేహితులైన ఇద్దరు మహిళలు (ఆంగ్లేయులే) ఆ బగ్గీలో ఉన్నారు. వీరివెనకాల మరో బగ్గీలో కింగ్స్ఫోర్డ్, ఆయన భార్య ఉన్నారు.
ఈ విషయం తెలియని ఖుదీరాం, ప్రఫుల్లలు రాత్రంతా ప్రయాణం చేస్తునే ఉన్నారు. రైలెక్కిన ప్రఫుల్ల బోగీలోని ఓ పోలీసుతో మాటల్లో దొరికిపోవటంతో... తన దగ్గరున్న పిస్తోల్తో పేల్చుకొని చనిపోయాడు. రాత్రంతా 25 కిలోమీటర్లు నడిచి ఉదయానికి వని అనే రైల్వే స్టేషన్ చేరుకున్న ఖుదీరాం కూడా అక్కడున్న పోలీసుల కంటపడ్డాడు. ఆయన వాలకం చూసి అనుమానం వచ్చి పట్టుకోవటంతో... జేబులోంచి రివాల్వర్ కింద పడింది. వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు. ప్రఫుల్ల చనిపోయిన విషయం తెలియని ఖుదీరాం... ఆయన్ను బతికించాలనే తపనతో తనపైనే నేరమంతా వేసుకొన్నాడు. జిల్లా కోర్టులో విచారణ అనంతరం మరణశిక్ష విధించారు. తీర్పు విన్నాక కూడా చిరునవ్వులు చిందిస్తున్న ఖుదీరాంను చూసి న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. తర్వాత హైకోర్టులో అప్పీలు చేయగా... అక్కడా మరణశిక్షే ఖరారైంది. 1908 ఆగస్టు 11న ధోతీకట్టుకొని... చేతిలో భగవద్గీత పట్టుకొని, ముఖంపై చిరునవ్వుతో రొమ్ము విరుచుకొని ఉరికంబమెక్కిన 18 ఏళ్ల 8 నెలల 8 రోజుల ఆ యువకుడి బలిదానాన్ని చూసి యావత్ కోల్కతా కదిలిపోయింది. అంతిమయాత్రలో వేలమంది పాల్గొన్నారు.
మరణానంతరం... ఖుదీరాం బెంగాల్కు ఓ ఫ్యాషనైపోయాడు. ఆయన ధరించిన ధోతీలాంటి వాటిని నేసిన బెంగాల్ చేనేత కార్మికులు...దానిపై ఖుదీరాం అని ముద్రవేసేవారు. పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు.. జాతీయోద్యమంలో పాల్గొనే యువకులంతా ఈ ధోతీలనే ధరించేవారు. ఇప్పుడు బెంగాల్లో కొన్ని కాలేజీలతో పాటు ఓ రైల్వేస్టేషన్కు ఖుదీరాం పేరు పెట్టారు.
‘‘తీర్పు అర్థమైందా? నీకు పడ్డ శిక్ష ఏంటో తెలిసిందా?’’ అంటూ జడ్జి అడగ్గా... ‘‘తీర్పు అర్థం కావటమే కాదు... ఓ పదినిమిషాల సమయం ఇస్తే మీకు బాంబు చేయటం ఎలాగో కూడా నేర్పించటానికి నేను సిద్ధం’’ అంటూ నవ్వుతూనే ధైర్యంగా బదులిచ్చాడు ఖుదీరాం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై ఛీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి