British Rule: ఆంగ్లే‘యమలోకం’
ఈస్టిండియా కంపెనీ హయాంలోనే అండమాన్ దీవులను ఖైదీల వలస కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడి వైపర్ దీవిని రాజకీయ ఖైదీల జైలుగా మార్చి... బహిరంగంగా ఉరి తీసేవారు కూడా. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల్లో
బ్రిటిష్వారికి గరుడ పురాణం... అందులో చెప్పే నరకలోక శిక్షల గురించి తెలియకున్నా... భూమ్మీదే అలాంటి నరకాన్ని సృష్టించారు. అదే అండమాన్ సెల్యులర్ జైలు. కాలాపానీగా పేరొందిన ఈ కారాగారం స్వాతంత్య్రం కోరిన భారతీయుల కోసం తెల్లవారు కట్టించిన ఓ మృత్యులోగిలి! విప్లవవాదులకు, తమను ఎదిరించిన రాజకీయ ఖైదీలకిక్కడ నరకం చూపించి, మిగిలినవారిలోనూ భయభ్రాంతులు కల్పించారు.
అండమాన్లోని కాలాపానీ జైలు
ఈస్టిండియా కంపెనీ హయాంలోనే అండమాన్ దీవులను ఖైదీల వలస కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడి వైపర్ దీవిని రాజకీయ ఖైదీల జైలుగా మార్చి... బహిరంగంగా ఉరి తీసేవారు కూడా. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతీయుల్లో భయం నింపటానికి అత్యంత భయానక జైలును నిర్మించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. తమలోని క్రూరత్వాన్ని కాలాపానీ రూపంలో చూపించింది. తిరుగుబాటుదారులను, సమస్యాత్మక రాజకీయ ఖైదీలను ఇక్కడికి పంపించి నరకయాతన పెట్టేవారు. అనేకమంది ఆ బాధలు, కష్టాలు పడలేక కన్నుమూశారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక మతిభ్రమించిన వారెందరో!
సిపాయిల తిరుగుబాటు తర్వాత కొన్నాళ్లకు జైలర్ డేవిడ్బారీ, మేజర్ జేమ్స్ పాటిసన్ వాకర్ల ఆధ్వర్యంలో 200 మంది ఖైదీలను అండమాన్ దీవుల్లో దించింది బ్రిటిష్ ప్రభుత్వం. వారితోనే 1896లో సెల్యులర్ జైలు నిర్మాణం ఆరంభించారు. బర్మా నుంచి తెప్పించిన రాయితో... 693 గదులతో జైలును నిర్మించారు. 13 సంవత్సరాల పాటు కష్టించి... తాముండే జైలును తామే కట్టుకున్నారు ఖైదీలు. సైకిల్ చక్రానికుండే పుల్లల ఆకృతిలో వరుసలు వరుసలుగా, ఖైదీలు ఒకరికొకరు కన్పించకుండా దీన్ని కట్టారు. చిన్న కిటికీతో ప్రతి గది 4.5మీటర్ల పొడవు, 2.7మీటర్ల వెడల్పు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కో గది (సెల్) ఉంటుంది కాబట్టి దీనికి సెల్యులర్ అనే పేరు వచ్చింది.
జైలులో ఈ దాష్టీకాలను భరించలేక నిరాహార దీక్ష చేసినవారు కూడా లేకపోలేదు. అయితే... వీటిని బ్రిటిష్ జైలర్లు దారుణంగా అణచివేశారు. బలవంతంగా ఖైదీలను పట్టుకొని కట్టేసి... వారి గొంతుల్లోంచి గొట్టాల ద్వారా పాలు, గుడ్లు, కూరగాయలు పంపించేవారు. ఈ క్రమంలో ఊపిరితిత్తులు పాడై, అనారోగ్యంపాలై మరణించినవారెందరో. వీరందరినీ బండలకు కట్టి సముద్రంలో విసిరేసేవారు.
1935 తర్వాత జరిగిన రాజకీయ ఒప్పందాల ఫలితంగా... ఈ జైలులోని ఖైదీలను విడిచిపెట్టేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఈ దీవులను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో రెండు, స్వాతంత్య్రానంతరం మరో రెండు వరుసలను కూల్చేశారు. మిగిలిన వరుసలు, టవర్ను జాతీయ స్మారకచిహ్నంగా మార్చారు.
తాగేందుకు నీళ్లు అడిగితే..
అసలే ఒంటరితనం. ఆపై దారుణమైన శిక్షలు. తమలోని విప్లవవాదం, జాతీయవాదం... రాజకీయంపై విరక్తి పుట్టేలా ఖైదీలను బాధించేవారు. బానిసలా పని చేయించేవారు. ఇంత పని చేయాలని కోటా పెట్టేవారు. మండే ఎండల్లో గంటల తరబడి పనిచేశాక... మంచి నీళ్లడిగితే మూత్రం పోసేవారు. ఎంతగా అలసిపోయినా విశ్రాంతి తీసుకోవటానికి లేదు. ఎవరైనా పనిలో బద్ధకిస్తున్నట్లు అనిపిస్తే దారుణంగా శిక్షించేవారు. జైలు గోడలకు, ఇనుప ఊచలకు, గుంజలకు బట్టలు ఆరవేసినట్లు రోజంతా వేలాడదీసేవారు. ఎప్పుడు పడితే అప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా లేదు. నిర్దేశించిన సమయాల్లో మాత్రమే వెళ్లాలి. గార్డు అనుమతివ్వకుంటే నిర్దేశిత సమయం అయ్యేదాకా ఆపుకోవాల్సిందే. నూనె గానుగలకు పశువులకు బదులు వీరినే కట్టి తిప్పేవారు. 1911 నుంచి 1921 దాకా ప్రముఖ స్వాతంత్య్రయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ ఈ జైలులోనే శిక్ష అనుభవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!