Omicron Variant: కట్టడికి కదులుదాం
‘ఒమిక్రాన్’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణ దిశగా కదిలిస్తోంది. వైరస్ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్కు పంపుతున్నాయి.
ఒమిక్రాన్ నియంత్రణకు ప్రపంచదేశాలు అప్రమత్తం
విమాన సర్వీసుల నిలిపివేత
యువత, టీకా తీసుకున్నవారు, ఇప్పటికే సోకిన వారికీ ముప్పు
దిల్లీ, బ్రసెల్స్, జొహానెస్బర్గ్: ‘ఒమిక్రాన్’ కలకలం ప్రపంచ దేశాల్ని పరుగులు పెట్టిస్తోంది. సత్వర కార్యాచరణ దిశగా కదిలిస్తోంది. వైరస్ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్కు పంపుతున్నాయి. పరీక్షల్ని ముమ్మరం చేశాయి. కొత్త వేరియంట్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బోట్స్వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. పలు ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయులు రావొద్దని బ్రిటన్తో పాటు, అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ప్రకటించాయి. విమాన సర్వీసుల్ని ఆపేస్తుండడంతో అనేక ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోతున్నారు. బ్రిటన్లో తొలిసారిగా శనివారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో అంగోలా, మొజాంబిక్, మలావీ, జాంబియాల నుంచి కూడా విదేశీయుల రాకపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. జర్మనీలోనూ ఒకరు ఒమిక్రాన్ బారిన పడినట్టు అనుమానిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన బి.1.1.529 వేరియంట్ బోట్స్వానా, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్లకు వ్యాపించింది. అనేక ఉత్పరివర్తనాలు సంతరించుకున్న ఈ వేరియంట్ చాలా శక్తిమంతమైనదని... పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నవారికి, ఇప్పటికే ఒకసారి కొవిడ్ బారిన పడినవారికి కూడా ఇది సోకవచ్చని వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో నిలిచిపోయిన కుటుంబాలు
కొత్త వేరియంట్ వెలుగుచూసిన క్రమంలో చాలా దేశాలు దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిలిపివేశాయి. ్టదీంతో పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సభ్యులను కలిసే నిమిత్తం దక్షిణాఫ్రికా వచ్చిన వందల మంది విదేశీయులు జొహానెస్బర్గ్, కేప్టౌన్ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. కొన్నిదేశాలు తమ పౌరులు మాత్రమే అక్కడి నుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నాయి. భారత్ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోంది. కొవిడ్కు ముందు షెడ్యూలు అయిన ప్రయాణికుల విమానాల్లో సగం మాత్రమే దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంకాంగ్ నుంచి రాకపోకలు సాగించేలా అనుమతించాలని నిర్ణయించింది. డిసెంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ మూడింటిని ‘ఎట్-రిస్క్’ దేశాలుగా కేంద్ర ఆరోగ్యశాఖ వర్గీకరించింది.
లాక్డౌన్ దిశగా దక్షిణాఫ్రికా
తాజా పరిణామాల క్రమంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా శనివారం అత్యవసరంగా ‘నేషనల్ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్’ సమావేశం ఏర్పాటు చేశారు. ఒమిక్రాన్ తీవ్రత, వ్యాప్తి తీరు, రాకపోకలపై విదేశాలు ఆంక్షలు విధించడం తదితర అంశాలపై చర్చించారు. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ విధించే అవకాశమున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ దేశాలు వరుసపెట్టి తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని దక్షిణాఫ్రికా తీవ్రంగా పరిగణించింది. ఇది తప్పుడు నిర్ణయమని, డబ్ల్యూహెచ్వో నియమావళికి విరుద్ధమని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి జోఫాహ్లా వ్యాఖ్యానించారు. ప్రపంచ సమస్యను కలిసి పరిష్కరించాల్సిన తరుణంలో కొన్ని దేశాలు బలిపశువులను వెతుకుతున్నాయని పేర్కొన్నారు.
నెదర్లాండ్స్ చేరుకున్న వారిలో 61 మందికి పాజిటివ్!
దక్షిణాఫ్రికాలోని జొహానెస్బర్గ్, కేప్టౌన్ విమానాశ్రయాల నుంచి రెండు విమానాల్లో నెదర్లాండ్స్ చేరుకున్న వారిలో 61 మందికి కొవిడ్ పాజిటివ్ ఫలితం వచ్చింది! వారిని అధికారులు శనివారం క్వారంటైన్కు తరలించారు.
ఆగ్నేయాసియా దేశాలకు డబ్ల్యూహెచ్వో హెచ్చరిక
‘ఒమిక్రాన్’ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయాలని, కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు పరచాలని, టీకా కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించాలని సూచించింది. జనం ఎక్కడా పెద్దసంఖ్యలో గుమిగూడకుండా, అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తల నడుమ వేడుకలు, పండుగలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్వో ప్రాంతీయ డైరెక్టర్ డా.పూనమ్ ఖేత్రపాల్సింగ్ శనివారం పేర్కొన్నారు.
తగినన్ని పడకలను సిద్ధం చేసుకోవాలి
దక్షిణాఫ్రికాలో శుక్రవారం కొత్తగా 2,828 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ వెలుగుచూసిన తర్వాత కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతుండగా.. ఈ వేరియంట్ యువతకే ఎక్కువగా సోకుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజా పరిస్థితిపై దక్షిణాఫ్రికాలోని సొవెటోస్లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న బరగ్వానాథ్ ఆసుపత్రి ఐసీయూ హెడ్ రూడో మాథివా స్పందించారు. ‘‘20, 30 ఏళ్ల వయసువారే ఎక్కువగా ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. వీరిలో మధ్యస్థాయి నుంచి తీవ్రస్థాయి లక్షణాలు ఉంటున్నాయి. కొందరికి ఐసీయూ అవసరమవుతోంది. బాధితుల్లో 65% మంది అసలు వ్యాక్సిన్ తీసుకోనివారే. మిగతా వారిలోనూ ఎక్కువమంది ఒక్కడోసు టీకా మాత్రమే తీసుకున్నారు’’ అని మాథివా పేర్కొన్నారు.
బెంగళూరులో కలకలం
దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. అయితే వారికి సోకింది డెల్టా వేరియంట్ మాత్రమేనని పరీక్షల్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ఈనెల 1 నుంచి 26 వరకూ మొత్తం 584 మంది వైరస్ తీవ్రత అధికంగా ఉన్న పది దేశాల నుంచి బెంగళూరుకు వచ్చారు. వారిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 94 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్ అని తేలింది! ఏ వేరియంట్ సోకిందన్నది తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను ప్రయోగశాలకు పంపాం. డెల్టా వేరియంట్ కారణంగానే వారు కొవిడ్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది’’ అని బెంగళూరు రూరల్ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం వారిద్దరూ క్వారంటైన్లోనే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్