సగం నిండిన సింగూరు ప్రాజెక్టు
మెతుకు సీమ వరప్రదాయిని సింగూరు జలాశయం సగం నిండింది. రెండేళ్లుగా కనీస ప్రవాహం లేక బీటలు వారిన ఈ జలాశయానికి ఈ ఏడాది ప్రవాహం వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1717.93 అడుగులకుగాను...
ఉరకలెత్తుతున్న కృష్ణాగోదావరులు
నిండుకుండల్లా జలాశయాలు
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే యంత్రాంగం: మెతుకు సీమ వరప్రదాయిని సింగూరు జలాశయం సగం నిండింది. రెండేళ్లుగా కనీస ప్రవాహం లేక బీటలు వారిన ఈ జలాశయానికి ఈ ఏడాది ప్రవాహం వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1717.93 అడుగులకుగాను ప్రస్తుతం 1703.90 అడుగులకు చేరింది. జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలకు ప్రస్తుతం 14.17 టీఎంసీలున్నాయి. గతేడాది ఇదే సమయానికి ఈ జలాశయంలో 0.41 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం జలాశయంలో జలసవ్వడి పెరగడంతో దిగువ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరుగుతున్నాయి. వ్యవసాయ బోర్లు కూడా తేరుకుంటున్నాయి. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పినట్లేనని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్లో నిల్వ 4.32 టీఎంసీలకు చేరుకుంది. గోదావరి పరీవాహకంలోని జలాశయాలు కళకళలాడుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతంగా వచ్చి చేరుతోంది. రాబోయే 4 రోజుల వరకు వరద ఉద్ధృతి కొనసాగనుండటంతో ముందు జాగ్రత్తగా మొత్తం 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ ఈఈ రామారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సమయానికి వివిధ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల రుణం సేకరణ నిమిత్తం బాండ్లను వేలం వేయనున్నట్లు రిజర్వుబ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23న వీటిని వేలం వేయనున్నట్లు వివరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?