వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి
కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడానికి అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు గురువారం హైకోర్టు అంగీకరించింది. గతంలోలా ఎలాంటి వివరాలు అడగకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే అభ్యంతరం లేదంది.
హైకోర్టు అంగీకారం
ఆధార్, కులం వివరాలు అడగబోమని సర్కారు హామీ
ఈనాడు, హైదరాబాద్: కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడానికి అనుమతించాలన్న ప్రభుత్వ అభ్యర్థనకు గురువారం హైకోర్టు అంగీకరించింది. గతంలోలా ఎలాంటి వివరాలు అడగకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే అభ్యంతరం లేదంది. ఇందుకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసుకుని, ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య (పీటీఐఎన్) సమర్పిస్తే ఆన్లైన్లోగానీ, భౌతికంగా కానీ రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆధార్ నంబర్లు, కులం, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించబోమని కోర్టుకు హామీ ఇచ్చింది.
ఎలాంటి చట్టం లేకుండా ధరణి నమోదుతో పాటు కులం, ఆధార్ వివరాలు అడగటాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు కె.సాకేత్, ఐ.గోపాల్శర్మ మరికొందరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు మరికొన్ని మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారని, అందువల్ల కౌంటర్లు దాఖలు చేయడానికి మరికొంత గడువివ్వాలని కోరారు. కొన్ని ఇతర అత్యవసర అంశాలున్నాయని, కరోనా వ్యాప్తి, ధరణి వంటి కొత్త వేదిక తీసుకురావడం తదితరాల నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు వెళ్లలేకపోతోందని, అందువల్ల గత ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేయాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ తాము స్టే ఇవ్వలేదని, రిజిస్ట్రేషన్ చేయవద్దని చెప్పలేదని, పాత పద్ధతిలో చేసుకోవచ్చని కూడా సూచించామంది. ఈ దశలో గోపాల్శర్మ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్రెడ్డి జోక్యం చేసుకుంటూ గత పద్ధతిలో ఆన్లైన్ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లి చేసుకునేవారని, ప్రస్తుతం మొత్తం ఆన్లైన్లోనే అంటున్నారన్నారు. గతంలో పీటీఐఎన్ అడిగేవారు కాదని, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 70, నిబంధనలు పరిశీలిస్తే తెలుస్తుందన్నారు. రిజిస్ట్రేషన్లను వారే గత సెప్టెంబరులో నిలిపివేశారని, పాత పద్ధతిలో ఎలాంటి పరిమితులు లేకుండా చేయబోమని ఆదేశించాలని కోరారు. దీనిపై ఏజీ స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయాలని ప్రభుత్వం ఎన్నడూ ప్రయత్నించలేదని, గతంలో ఉన్న విధానంలోనే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్ సౌకర్యం లేనివారి పరిస్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా రిజిస్ట్రేషన్ శాఖ సహకారం అందిస్తుందని.. అయితే స్లాట్ బుకింగ్ తప్పనిసరని ఏజీ తెలిపారు. ధరణి పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయడంలేదని స్పష్టం చేశారు. వాదనలను విన్న ధర్మాసనం ఏజీ హామీని నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 70ఎ, 70బి, 70సిలు, నిబంధనలు 221 నుంచి 237 వరకు పేర్కొన్న విధానంలో రిజిస్ట్రేషన్కు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఇతర మధ్యంతర పిటిషన్లపై ఈనెల 14లోగా కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.
స్లాట్ బుకింగ్పై నిషేధం లేదు
రిజిస్ట్రేషన్ నిమిత్తం స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. స్లాట్ బుకింగ్పై చట్టప్రకారం ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. ఒకేసారి వెయ్యి మంది వస్తే ఇబ్బందులుంటాయని, క్రమపద్ధతిలో ఉంచడానికే స్లాట్ పద్ధతి ఉపయోగపడుతుందని తెలిపింది. ఒకవేళ ఆన్లైన్లో ఇబ్బందులున్నా, కంప్యూటర్ వ్యవస్థ పాడైనా నిబంధనల్లోనే ప్రత్యామ్నాయం ఉందని పేర్కొంది. స్లాట్ బుకింగ్ చేసుకున్నాక కేటాయించిన సమయంలో రిజిస్ట్రేషన్కు రావచ్చని, ఒకవేళ పీటీఐఎన్ నంబరు లేకపోతే రెండు రోజుల్లో కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు పచ్చజెండా
నేటి నుంచి పాత విధానంలోనే స్లాట్ నమోదు
14 నుంచి రిజిస్ట్రేషన్లు
సీఎం ఆదేశంతో ఏర్పాట్లు చేసిన రిజిస్ట్రేషన్ శాఖ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్వపు విధానంలో (కార్డ్) స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ నమోదు ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్లు మాత్రం 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ధరణి పోర్టల్ వేదికగా జరపాలనే తలంపుతో రాష్ట్రంలో సెప్టెంబరు 8వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లను నిలిపేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ధరణి పోర్టల్ ద్వారానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగేలా పురపాలక, జీహెచ్ఎంసీ, గ్రామపంచాయతీలకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య ఉన్న ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్లో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ధరణిలో ఆధార్ వంటి వివరాల నమోదుపై అభ్యంతరాలు వ్యక్తంకావడం, కోర్టు కేసుల నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకాలేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను శుక్రవారం నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు సీఎస్ సోమేశ్కుమార్తో ఈ విషయమై చర్చించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ‘శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీచేశాం. రిజిస్ట్రేషన్లు 14 నుంచి ఆరంభిస్తాం. దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు లేదా మార్గదర్శకాలు జారీఅవుతాయి. ఆ ప్రకారం ప్రక్రియను కొనసాగిస్తాం’ అని ఆ శాఖ ఉన్నతాధికారి తెలిపారు.
నిర్ణయాలివీ
* 11 నుంచి స్లాట్ నమోదు చేసుకోవచ్చు.
* పూర్తి రుసుం చెల్లించిన వారికే ఈ అవకాశం ఉంటుంది.
* 14 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి.
* ఇకపై ముందస్తుగా వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకుంటేనే రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్