రాష్ట్రంలో 50 వేల మందికి శిక్షణ
రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు దాదాపు 50 వేల మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. గత వారమే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తికాగా రెండు రోజులుగా జిల్లాల్లోనూ శిక్షణను నిర్వహిస్తున్నారు. వచ్చే 7-10 రోజుల్లోగా ప్రాథమిక
జిల్లాకో కొవిడ్ టీకా నిల్వ కేంద్రం
అవసరాల మేరకు స్థానికంగా నియామకాలు
ఒకేరోజు వైద్యసిబ్బందికి టీకాలిచ్చేలా ఏర్పాట్లు
ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో కొవిడ్ టీకాల పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు దాదాపు 50 వేల మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. గత వారమే రాష్ట్రస్థాయిలో శిక్షణ పూర్తికాగా రెండు రోజులుగా జిల్లాల్లోనూ శిక్షణను నిర్వహిస్తున్నారు. వచ్చే 7-10 రోజుల్లోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిల్లోనూ వైద్య సిబ్బందికి శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొని వైద్యసిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పది వేల కేంద్రాల్లో టీకాలు
రాష్ట్రంలో తొలివిడతలో సుమారు 75 లక్షల మందికి కొవిడ్ టీకా అందజేసే అవకాశం ఉంది. ఇందులో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యసిబ్బంది ఉంటారు. సుమారు 2 లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రవాణా సిబ్బందికీ టీకాలిస్తారు. మిగిలిన వారిలో దాదాపు 60 లక్షల మందికి పైగా 50ఏళ్లు పైబడిన వారు ఉంటారని అంచనా. వీరు కాకుండా 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారికీ టీకా అందజేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యసిబ్బంది సమాచారం ఇప్పటికే కొవిన్ యాప్లో పొందుపర్చగా.. ఇతర కేటగిరీల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. దీంతోపాటు స్వచ్ఛందంగా కూడా ఆయా కేటగిరీల వ్యక్తులు టీకా కోసం కొవిన్ యాప్లో సమాచారాన్ని పొందుపర్చేందుకు అవకాశం కల్పిస్తారు. టీకాలు రాష్ట్రానికి చేరగానే.. తొలుత ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించారు. వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు టీకాలివ్వాలని ప్రణాళిక రూపొందించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందికి కూడా ప్రభుత్వ బృందాల ఆధ్వర్యంలోనే టీకాలిస్తారు. కొవిడ్ టీకా వేయడానికి మొత్తం 10 వేల బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందం ఒక్కో కొవిడ్ కేంద్రంలో టీకాలను అందజేస్తుంది. ఇందుకోసం 10వేల మంది ఏఎన్ఎంలకు, 25వేల మంది ఆశా ఆరోగ్య కార్యకర్తలకు, 15వేల మంది వైద్యులు, నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోగా శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, టీకాలు అందించడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని వైద్యకార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.
టీకాల నిల్వకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో టీకాల నిల్వ కేంద్రాలుండగా వీటితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కొవిడ్ టీకాలను భద్రపర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల టీకాలను, జిల్లాల్లో కోటి టీకాలను ఏకకాలంలో భద్రపర్చేలా సన్నాహాలు చేస్తున్నారు. టీకాలను సరఫరా చేసేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చుకుంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టీకాల సరఫరాకు 16 వాహనాలు అందుబాటులో ఉండగా మరో 17 వాహనాలను కొనుగోలు చేయడానికి ఆదేశాలిచ్చారు. సమాచారాన్ని పొందుపర్చడంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మానవ వనరులను స్థానికంగానే నియమించుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న టీకా నిల్వ పరికరాల్లో ఇబ్బందులుంటే సత్వరమే మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాల వైద్యాధికారులకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా