యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే
ఆరోగ్య రంగ సిబ్బంది, కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న ఇతర వర్గాలకు మాత్రమే తొలి విడత టీకాలను ఉద్దేశించాం. దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని నా వ్యక్తిగత సూచన. ప్రజా ప్రతినిధులమైన మనం దానిలో భాగం కాదు.
తొలి విడతలో మూడు కోట్ల మందికి
సీఎంలతో సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి
మరోలా అర్థం చేసుకోవద్దు..
ఆరోగ్య రంగ సిబ్బంది, కరోనాపై పోరులో ముందు నిలుస్తున్న ఇతర వర్గాలకు మాత్రమే తొలి విడత టీకాలను ఉద్దేశించాం. దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని నా వ్యక్తిగత సూచన. ప్రజా ప్రతినిధులమైన మనం దానిలో భాగం కాదు.- ప్రధాని మోదీ
దిల్లీ: దేశంలో తొలివిడతలో మూడు కోట్ల మంది యోధులకు కరోనా టీకా ఇచ్చేందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ విడతలో ప్రజా ప్రతినిధులకు చోటు ఉండదని చెప్పారు. కరోనా తాజా పరిస్థితి, వ్యాక్సిన్ అందజేతపై చర్చించడానికి సోమవారం ఆయన ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు 50 దేశాల్లో 2.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందితే మన దేశంలో జనవరి 16 నుంచి మొదలయ్యే కార్యక్రమంలో మూడు కోట్ల యోధులు సహా మొత్తం 30 కోట్ల మందికి అందబోతోందని ప్రధాని చెప్పారు. కొన్ని నెలల్లోనే ఇంతమందికి టీకా వేయడం ప్రపంచంలోనే అతిపెద్ద కసరత్తుగా నిలిచిపోతుందన్నారు.
దేశీయ తయారీ గర్వకారణం
‘‘మన దేశంలో ఇప్పటికే తయారైన రెండు కొవిడ్-19 టీకాలు ప్రపంచంలో ఇతర రకాల కంటే ఎంతో చౌక. దేశీయ అవసరాల కోసం వీటిని అభివృద్ధి చేశారు. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ సిద్ధం చేసిన కొవాగ్జిన్ టీకాలతో పాటు మరో నాలుగు త్వరలో రాబోతున్నాయి. వ్యాక్సిన్లు మొదలయ్యాక దేశంలో కరోనాపై పోరు ఒక నిర్ణయాత్మక దశకు చేరుకుంటుంది. కసరత్తు రెండో దశకు చేరేనాటికి ఇంకొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పనితీరు గురించి తగినంత సమాచారం లేకుండానే వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామన్న విపక్ష నేతల ఆరోపణలు సబబు కాదు. పౌరులకు సమర్థమైన వ్యాక్సిన్లు అందేలా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. టీకాల విషయంలో శాస్త్రవేత్తలదే తుది నిర్ణయమని నేను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నాను. అత్యవసర అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారు కావడం గర్వకారణం. విదేశీ వ్యాక్సిన్లపై ఆధారపడాల్సి వస్తే మనకెంత కష్టమయ్యేదో ఊహించుకోవచ్చు’’ అని మోదీ చెప్పారు.
మన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది
టీకాలు వేయడంలో మన దేశానికి ఉన్న అనుభవం ఇప్పుడెంతో ఉపయోగపడుతుందని ప్రధాని అన్నారు. నిపుణులు, శాస్త్రవేత్తలు కలిసి రాష్ట్రాలతో మాట్లాడిన తర్వాతే టీకాలకు ప్రాధాన్యాలను నిర్ణయించామని వివరించారు. ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పారామిలిటరీ బలగాలు, హోంగార్డులు, విపత్తు నిర్వహణ సేవకులు, పౌర రక్షణ జవాన్లు, కంటెయిన్మెంట్/ నిఘాతో సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులు తొలి విడతలో వ్యాక్సిన్ పొందుతారని చెప్పారు. వీరంతా కలిసి మూడు కోట్ల వరకు ఉంటారన్నారు. ఎన్నికల్లో బూత్స్థాయి వ్యూహాన్ని అనుసరించిన రీతిలోనే ఇప్పుడు ముందుకు వెళ్తామని చెప్పారు. ఎవరికి టీకా వేయాలో గుర్తించి, పర్యవేక్షించడమే అత్యంత ముఖ్యాంశమన్నారు. ఆధార్ సాయంతో లబ్ధిదారుల్ని గుర్తించి, సకాలంలో వారికి రెండో మోతాదు అందేలా చూస్తామని చెప్పారు. మొదటి మోతాదు తీసుకున్నవారికి కొ-విన్ యాప్ద్వారా డిజిటల్ ధ్రువపత్రం అందుతుందని, రెండో మోతాదును అది గుర్తుచేసి, ఆ తర్వాత తుది ధ్రువీకరణను ఇస్తుందని తెలిపారు.
‘కరోనా విస్తృతి విషయంలో అనేక దేశాల కంటే మన దేశం మెరుగ్గా ఉండడం ఆనందదాయకమే. అయినా నిర్లక్ష్యం ఎంతమాత్రం పనికిరాదు. ఆరు నుంచి ఎనిమిది నెలల క్రితం ప్రజల్లో కనిపించిన భయాందోళన ఇప్పుడు లేదు. కరోనాపై పోరాడే విషయంలో ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం.. ఆర్థిక కార్యకలాపాలపైనా సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో టీకా ఇచ్చే కార్యక్రమంపై వదంతులు వ్యాప్తి చెందకుండా రాష్ట్రాలు జాగ్రత్త వహించాలి. వీటికి కళ్లెం వేయడంలో సామాజిక, మతపరమైన బృందాలను భాగస్వాముల్ని చేయాలి’ అని సూచించారు. రెండు రోజుల క్రితం తాను నిర్వహించిన సమీక్షలో రాష్ట్రాల నుంచి మంచి సలహాలు వచ్చాయని, కేంద్రం-రాష్ట్రాల మధ్య సహకారం.. సమాఖ్యతత్వానికి గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.