హైదరాబాద్లో ఎన్కామ్
దేశంలోనే తొలి జాతీయ సంకలిత తయారీ కేంద్రం(నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎన్కామ్) హైదరాబాద్లో నెలకొల్పేందుకు....
దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు
సమగ్ర నివేదికతో కేంద్రానికి ప్రతిపాదనలు
భాగస్వామిగా చేరనున్న ‘జాతీయ సంకలిత తయారీ సంఘం’
ఈనాడు, హైదరాబాద్: దేశంలోనే తొలి జాతీయ సంకలిత తయారీ కేంద్రం(నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎన్కామ్) హైదరాబాద్లో నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కృత్రిమమేధ, రోబోటిక్, యంత్ర పరిజ్ఞానం వంటి నవీన సాంకేతికతలతో త్రీడీ ప్రింటింగ్, కంప్యూటర్ ఆధారిత ఆకృతి(క్యాడ్), సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సాయంతో పరిశ్రమలకు అవసరమైన ప్రాజెక్టులు, పరికరాలు, విడిభాగాల నమూనాలను రూపొందించి అందించడం వంటి కార్యకలాపాలను ఇందులో నిర్వహించనున్నారు. వాటిపై పరిశోధనలు, అభివృద్ధి, అకృతుల తయారీలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా యువతకు, నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ‘జాతీయ సంకలిత తయారీ సంఘాన్ని’ ఇందులో భాగస్వామిగా చేర్చాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్కామ్ కేంద్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇవి త్రీడీ తదితర నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భారీ పరిశ్రమలతోపాటు సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా యంత్ర పరికరాల నమూనాలు, పరికరాలు రూపొందించి ఇస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమల నవీకరణకూ ఊతమిస్తున్నాయి. భారత్లోనూ ఈ తరహా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జాతీయ సంకలిత తయారీ ముసాయిదా’ విధానాన్ని ప్రకటించింది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయస్థాయి కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. తొలి కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధమైన రాష్ట్రం ఒక్కటేకావడం, ఐటీ రంగంలో ఇప్పటికే గుర్తింపు ఉండటంతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఆమోదిస్తే మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరడంతోపాటు జాతీయస్థాయి సంస్థగా గుర్తింపు లభిస్తుంది. కేంద్రం ఆమోదించని పక్షంలో సొంతంగా దీనిని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పరిశ్రమలతోపాటు వాహనాల తయారీ, వైమానిక, రక్షణ, ఆరోగ్య పరిరక్షణ, దుస్తుల తయారీ, నిర్మాణ, వినియోగవస్తు పరికరాల రంగాల అభ్యున్నతికి దీన్ని వినియోగించుకోవాలని భావిస్తోంది.
ఇదీ ప్రణాళిక
* ప్రస్తుతం తెలంగాణలో టీహబ్, వీహబ్, టీవర్క్స్, జీఎస్ఐలీ, రిచ్ వంటి సంస్థల ద్వారా నవీన అంకుర ఆలోచనలు, ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అదే తరహాలో సంకలిత కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
* దీని ఏర్పాటులో వివిధ దేశాల్లో నడుస్తున్న కేంద్రాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
* పరిశ్రమలు, విద్యాసంస్థలను అనుసంధానం చేసి, ఇంజినీరింగ్ తదితర కోర్సుల విద్యార్థులకు ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. వినియోగదారుల అవసరాల మేరకు పరికరాల రూపకల్పన, మార్కెటింగ్పైనా పారిశ్రామికవేత్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
* ఇందులో భాగంగా తెలంగాణ ఐటీశాఖ నవీన సాంకేతికతల విభాగం ఈ నెల 6వతేదీన దృశ్యమాధ్యమ సదస్సు నిర్వహించి, దేశవ్యాప్తంగా ఈ రంగానికి చెందిన పరిశ్రమలు, అంకురాలు, విద్యావేత్తల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. దాన్ని రాష్ట్రం.. కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
ప్రపంచస్థాయి కేంద్రంగా మారుతుంది
- జయేశ్రంజన్, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శిప్రస్తుతం ఎన్కామ్లకు ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆవిష్కరణలు, పరిశోధన కేంద్రంగా దీన్ని ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతం ఈ రంగంలోని పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. హైదరాబాద్లో జాతీయ స్థాయి కేంద్రంతో పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలా మేలు జరుగుతుంది. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధిని, జాతీయ లక్ష్యాలను సాధిస్తుంది. దేశీయ మార్కెట్ అవసరాలను తీరుస్తుంది. ఎగుమతులకూ అవకాశం ఉంటుంది. భారీఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా