జంట హత్యల దర్యాప్తు స్థానికంగానే
సంచలనం సృష్టించిన గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును స్థానిక పోలీసులే పూర్తిచేయనున్నారు. వీలైనంత త్వరగా అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్న
సిట్ ఏర్పాటు లేనట్లే
త్వరలోనే అభియోగపత్రాలు
ఈనాడు, హైదరాబాద్: సంచలనం సృష్టించిన గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును స్థానిక పోలీసులే పూర్తిచేయనున్నారు. వీలైనంత త్వరగా అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్న అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపిన ఈ జంట హత్యల కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేయాలని న్యాయవాదులు, రాజకీయ పక్షాలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హత్యల్లో రాజకీయ నాయకుల ప్రమేయంతో పాటు పోలీసుల పాత్రపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జంట హత్యల కేసును స్థానిక పోలీసులకు కాకుండా సీబీఐకి అప్పగించాలని, లేదంటే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని పలువురు డిమాండు చేశారు. ఉన్నతాధికారులు మాత్రం ఈ కేసు దర్యాప్తునకు స్థానిక పోలీసులు సరిపోతారని భావిస్తున్నారు. సాధారణంగా జంట హత్యల కేసు దర్యాప్తు సీఐ స్థాయి అధికారి చూస్తారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేసు కావడంతో ఇక్కడ డీఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించామని, ఆయనపై మరో పర్యవేక్షణాధికారి ఉంటారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. కేసు కోణంలో చూస్తే అంతా స్పష్టంగానే ఉందని, హత్యలకు పాల్పడ్డవారు, వారికి సహకరించిన వారు దొరికిపోయారని, వీడియో సహిత ఆధారాలు లభించాయని, చనిపోయే ముందు వామన్రావు వెల్లడించిన వివరాలు సైతం అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఇంకా దీని వెనుక ఎవరైనా ఉంటే తప్పక పట్టుబడతారని, కేసు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరం కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, త్వరలోనే అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టవచ్చని, వీలైతే ఫాస్ట్ట్రాక్ న్యాయస్థానంలో విచారణ జరిపించాలని భావిస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరును హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వామన్రావు శరీరంపై 14 గాయాలు?
పెద్దపల్లి, న్యూస్టుడే: న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో కీలకమైన శవ పరీక్ష నివేదిక సోమవారం పోలీసుల చేతికి అందనుంది. ఇది విచారణను వేగవంతం చేయడానికి దోహదపడనుంది. ఘటన ఎప్పుడు జరిగింది.. ఎంతసేపటికి అంబులెన్స్ అక్కడికి చేరుకుంది.. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది.. దంపతులు ఘటనా స్థలంలోనే మృతి చెందారా.. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంమధ్యలో ప్రాణాలు వదిలారా.. వంటి సందేహాలకు తెరపడే అవకాశముంది. మృతదేహాలకు గురువారం ఉదయం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు వైద్యులు సుమారు మూడు గంటలకుపైగా శ్రమించారు. సాధారణంగా ఈ ప్రక్రియకు అర గంట నుంచి గంట వరకు పడుతుంది. కాని ఈ కేసులో వైద్యులు ఎక్కువ సమయం తీసుకున్నారు. అవసరమైన భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. పదునైన ఆయుధాలను వినియోగించడంతో శరీరంలోని అంతర్గత అవయవాల్లో లోతైన గాయాలైనట్లు తెలిసింది. నాగమణి శరీరంపై 6, వామన్రావు శరీరంపై 14 గాయాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికతో గాయాల తీవ్రత తెలియడంతో పాటు ఘటన తర్వాత ఎంత సమయానికి న్యాయవాదులు మృతి చెందారు? సకాలంలో వైద్య సాయం అందించగలిగితే బతికేవా రా? తదితర అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలి
‘చలో గుంజపడుగు’లో లాయర్ల డిమాండ్
ఈనాడు డిజిటల్, కరీంనగర్: రాష్ట్రంలో పట్టపగలే న్యాయవాద దంపతులను అతి కిరాతకంగా హత్య చేయడం దారుణమని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వామన్రావు దంపతుల హత్యను నిరసిస్తూ భాజపా రాష్ట్ర లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం వివిధ జిల్లాల బార్ అసోసియేషన్ల సభ్యులు, న్యాయవాదులు ‘చలో గుంజపడుగు’ పేరిట బస్సు యాత్ర నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాష్ట్రంలో పాలన ఫాంహౌస్కే పరిమితమైందని, దీంతో గూండాలు దారుణాలకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడికి ఈ ఘటన నిదర్శనమని భాజపా లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ ఆరోపించారు. ఈ హత్యల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ ద్వారా న్యాయవాద రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నిందితుల తరఫున న్యాయవాదులు ఎవరూ వకాలత్ పుచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే నిజాలు బయటకు వస్తాయని, ఈ హత్యల వెనుక ఉన్న అధికార పార్టీ నేతలు, అధికారుల పాత్ర వెల్లడవుతుందన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు కల్వచర్ల వద్ద సంఘటన స్థలాన్ని సందర్శించారు. గుంజపడుగులో వామన్రావు తల్లిదండ్రులను పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’