నేటి కృష్ణా బోర్డు సమావేశం వాయిదా
కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వినియోగం, ఇతర అంశాలపై చర్చించి ఓ అంగీకారానికి వచ్చేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్లు, బోర్డు సభ్యకార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.
జల వివాద నేపథ్యంలో ప్రాధాన్యం
తదుపరి సమావేశంలోపు పూర్తిస్థాయి బోర్డు మీటింగ్!
ఈనాడు - హైదరాబాద్
కృష్ణా నది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వినియోగం, ఇతర అంశాలపై చర్చించి ఓ అంగీకారానికి వచ్చేందుకు ఈ నెల 9న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్లు, బోర్డు సభ్యకార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ మీటింగ్కు హాజరుకావడానికి ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకోగా.. వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. నీటి వాటాలో తెలంగాణకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను ఎజెండాలో చేర్చలేదని పేర్కొంది. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని అడిగింది. కొత్తగా బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఎంపీ సింగ్ దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి వాయిదాకు నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. శుక్రవారం జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి గురువారం రెండు రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్లకు లేఖ రాశారు. సమావేశం ఎప్పుడన్నది తర్వాత నిర్ణయిస్తామన్నారు.
సగం వాటా ఇవ్వాల్సిందే.. తెలంగాణ
తదుపరి సమావేశంలోపు పూర్తిస్థాయి బోర్డు సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇందులో బోర్డు ఛైర్మన్, సభ్యకార్యదర్శి, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్లు, బోర్డులో విద్యుత్తు విభాగాన్ని పర్యవేక్షించే చీఫ్ ఇంజినీర్ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఇప్పటివరకు ఒక రాష్ట్రం రాసిన లేఖను ఇంకో రాష్ట్రానికి పంపడం, తమ సూచనలను రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని కేంద్రానికి నివేదించడానికే బోర్డు పరిమితమైంది. త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడినందున పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరిగే వరకు నీటి వినియోగం తదితర అంశాలపై వివాదం కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్న కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ 66 శాతం, తెలంగాణ 34 శాతం వినియోగించుకునేలా గతంలో నిర్ణయం జరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో దీనిని 50:50 నిష్పత్తికి మార్చాలని తెలంగాణ కోరుతోంది. ఇలాంటి అనేక అంశాలు బోర్డు సమావేశంలో ఎజెండాగా ఉండే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!