పీజీ నీట్కు స్వస్తి!
పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న నీట్కు స్వస్తి చెప్పాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఎంబీబీఎస్ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే ‘నేషనల్ ఎగ్జిట్’ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్ పీజీలోనూ....
ఎగ్జిట్ పరీక్ష మార్కులే ప్రామాణికం
వచ్చే ఏడాది నుంచే అమలు
పీజీ వైద్యవిద్యలో కొత్త కోర్సులు
ఎన్ఎంసీ ముసాయిదా విడుదల
ఈనాడు, హైదరాబాద్: పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న నీట్కు స్వస్తి చెప్పాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఎంబీబీఎస్ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే ‘నేషనల్ ఎగ్జిట్’ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్ పీజీలోనూ ప్రవేశాలను నిర్వహించనుంది. ఎగ్జిట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పీజీ సీటు కోసం ప్రయత్నించవచ్చు లేదా వైద్యవృత్తిని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఎగ్జిట్లో ఉత్తీర్ణులైతేనే రిజిస్ట్రేషన్కు అనుమతిస్తారు. వచ్చేఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలను ఎన్ఎంసీ పరిశీలిస్తోంది. ఎగ్జిట్ పరీక్షలో వచ్చే మార్కులకు మూడేళ్ల వరకూ పరిమితి ఉంటుంది.
పీజీ మెడికల్ సీట్ల నిబంధనల క్రమబద్ధీకరణలో మార్పులు చేస్తూ ఎన్ఎంసీ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినవారు.. మరుసటి ఏడాదికి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మళ్లీ అవకాశమిస్తారా? లేదా? అనే స్పష్టతను ముసాయిదాలో పొందుపరచలేదు. దీనిపై తమ అభిప్రాయాలను, సూచనలు, సలహాలను president.pgmeb@nmc.org.in కు ఈనెల 30వ తేదీలోగా పంపించాలని ఎన్ఎంసీ కోరింది.
మరికొన్ని కీలక నిర్ణయాలు
* ఇకనుంచి పీజీ వైద్యవిద్యార్థులను జిల్లా ఆసుపత్రికి కూడా మూణ్నెల్ల పాటు పంపాలని నిర్ణయించారు. వీరికి అక్కడ కూడా ఉపకార వేతనాలు లభిస్తాయి.
* పీజీ సూపర్ స్పెషాలిటీలో ఇప్పటి వరకూ వేర్వేరుగా ఉన్న రుమటాలజీ, క్లినికల్ ఇమ్యునాలజీలను ఒకటిగా కలిపేశారు. కొత్తగా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సులను కొత్తగా అందుబాటులోకి తేనున్నారు. పీజీలో బయో ఫిజిక్స్, మెడికల్ జనటిక్స్ కోర్సులను తీసేశారు.
* విద్యాబోధన చేసేటప్పుడు ఉండే పీజీ గైడ్ అర్హత కాలాన్ని ఎనిమిది నుంచి అయిదేళ్లకు కుదించారు. ప్రస్తుతం ఒక యూనిట్లో ఒక ప్రొఫెసర్కు తన అనుభవంతో సంబంధం లేకుండా.. 3 పీజీ సీట్లు ఇస్తున్నారు. ఈ విధానంలో స్వల్పమార్పులు చేస్తూస్పష్టత ఇచ్చారు.
* ఉదాహరణకు ఒక వైద్య కళాశాలలో ఆచార్యుడికి పీజీ బోధనలో ఏడాది అనుభవమే ఉంటే.. ఆ యూనిట్కు ఒక్క పీజీ సీటిస్తారు. రెండేళ్ల అనుభవం ఉండి.. ఏడాదిలో ఇద్దరు పీజీ విద్యార్థులకు బోధన అందిస్తే ఆ యూనిట్కు 2 పీజీ సీట్లు.. ఆచార్యుడికి అయిదేళ్ల అనుభవం ఉండి, ఏడాదికి కనీసం ఇద్దరు పీజీ విద్యార్థులకు బోధన చేస్తుంటే.. 3 సీట్లు అనుమతిస్తారు. ఆ వైద్యసంస్థలో పదేళ్లుగా పీజీ సీట్లను నిర్వహిస్తూ ఉంటేనే 3 పీజీ సీట్లకు అర్హత లభిస్తుంది. ఇకపై ఆచార్యుడు కూడా మూడేళ్లలో కనీసం 3 పరిశోధన పత్రాలు సమర్పించాలి.
వైద్యసేవల్లో మెరుగైన నాణ్యత ప్రమాణాలు
- డాక్టర్ పుట్టా శ్రీనివాస్, సంచాలకులు మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్యకళాశాల
జిల్లాలకు పీజీ వైద్య విద్యార్థులను పంపించడం వల్ల గ్రామీణ వైద్యం బలోపేతమవుతుంది. వైద్యవిద్యార్థులకు కూడా గ్రామాల్లో జబ్బుల పరిస్థితి గురించి తెలుస్తుంది. ఎగ్జిట్ పరీక్ష విధానంలో అనుకోని కారణాల వల్ల తక్కువ మార్కులు వచ్చినవారికి మళ్లీ రాసే అవకాశం కల్పించాలి. కొత్త కోర్సుల వల్ల కూడా వైద్యవృత్తి విస్తృతమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్