కాబుల్లో ఉగ్ర కుట్ర భగ్నం
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో మరో మారణహోమం త్రుటిలో తప్పింది! అక్కడి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసింది.
విమానాశ్రయం వద్ద మరో దాడికి ఐఎస్ఐఎస్-కె పన్నాగం
ఆత్మాహుతి దళ సభ్యులను మట్టుబెట్టిన అమెరికా
అరాచక పాలనకు తాలిబన్ల శ్రీకారం!
కాబుల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో మరో మారణహోమం త్రుటిలో తప్పింది! అక్కడి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసింది. దాడి చేసేందుకు దూసుకొస్తున్న ఆత్మాహుతి దళ సభ్యులను ముందే మట్టుబెట్టింది. విమానాశ్రయానికి సమీపంలో ఆదివారం రాకెట్ దాడి చోటుచేసుకోవడం.. అందులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం కూడా కలకలం సృష్టించింది. మరోవైపు- దేశంలో ఎవరికీ హాని తలపెట్టబోమంటూ ఇచ్చిన హామీని తాలిబన్లు మరోసారి తుంగలోకి తొక్కారు. ప్రముఖ జానపద గాయకుడిని కిరాతకంగా కాల్చిచంపారు. మహిళల హక్కుల పరిరక్షణపైనా వారు మాట తప్పారు. కాందహార్లో టీవీలు, రేడియోల్లో సంగీతంతో పాటు మహిళల స్వరంపై నిషేధం విధించారు.
కాబుల్ విమానాశ్రయం వద్ద గత గురువారం నరమేధానికి పాల్పడ్డ ఐఎస్ఐఎస్-కె ఉగ్ర సంస్థ ఆదివారం మరోసారి అలాంటి దాడికి వ్యూహరచన చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని తాము గుర్తించామన్నారు. డ్రోన్ దాడి ద్వారా వారిని హతమార్చామని చెప్పారు. డ్రోన్ దాడి అనంతరం భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయని.. వాహనం నిండా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తద్వారా స్పష్టమవుతోందని వివరించారు.
రాకెట్ దాడిలో చిన్నారి మృతి
కాబుల్ విమానాశ్రయానికి వాయవ్య దిశలో.. కేవలం ఒక కిలోమీటరు దూరంలోని ఖువ్జా బుఘ్రా ప్రాంతంలో రాకెట్ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు కాబుల్ పోలీసు బాస్ రషీద్ వెల్లడించారు. దాడికి పాల్పడిందెవరో ప్రస్తుతానికి తెలియరాలేదన్నారు. ఖువ్జా బుఘ్రాలో చోటుచేసుకున్న రాకెట్ దాడి, అమెరికా బలగాలు జరిపిన డ్రోన్ దాడి.. వేర్వేరు ఘటనలు కాదని కూడా కొన్ని వార్తాసంస్థల్లో కథనాలు రావడం గమనార్హం.
కళాకారుడిపై కర్కశత్వం
బగ్లాన్ ప్రావిన్సులోని అందారాబ్ లోయలో తాలిబన్లు ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్ అందారాబీని క్రూరంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం ఫవాద్ ఇంటికి వెళ్లిన తాలిబన్లు.. ఆయన్ను కాల్చిచంపారు. వాస్తవానికి వారు గతంలోనూ తమ ఇంటికి వచ్చి సోదాలు నిర్వహించారని ఫవాద్ తనయుడు జవాద్ తెలిపారు. నాడు తన తండ్రితో కలిసి తేనీరు కూడా తాగారని పేర్కొన్నారు. శుక్రవారం మాత్రం పరిస్థితి మారిపోయిందని.. ఆయన్ను కిరాతకంగా కాల్చిచంపారని చెప్పారు. న్యాయం కోసం తాను స్థానిక తాలిబన్ మండలిని ఆశ్రయించానని తెలిపారు. హంతకులను శిక్షిస్తామని మండలి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఫవాద్ హత్య గురించి తమకు తెలియదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. ఫవాద్ హత్యను ఐక్యరాజ్య సమితి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించాయి.
మహిళల హక్కులపై మాట తప్పి..
మహిళలు చదువుకునేందుకు, పనిచేసేందుకు అనుమతిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన తాలిబన్లు.. వాస్తవంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వారు కాందహార్లో టీవీలు, రేడియో ఛానెళ్లలో సంగీతాన్ని నిషేధించారు. మహిళల స్వరాన్ని ప్రసారం చేకూడదని కూడా వాటి యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
పంజ్షేర్లో అంతర్జాల సేవలు బంద్
అఫ్గాన్లో ఇంకా తమ అధీనంలోకి రాని పంజ్షేర్ ప్రావిన్సుకు అంతర్జాల సేవలను తాలిబన్లు నిలిపివేశారు. దేశ తాజా మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ (తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు) ప్రస్తుతం ఈ ప్రావిన్సులోనే ఉన్నారు. ట్వీట్లు చేయకుండా ఆయన్ను నిలువరించేందుకే అంతర్జాల సేవలను నిలిపివేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్