ఒప్పందం ప్రకారమే బియ్యం తీసుకుంటాం
ధాన్యం కొనుగోళ్లు సహా అనేక విషయాల్లో లేని తప్పుల్ని భాజపాపై రుద్ది తెరాస ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం కేంద్రం పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం కొంటుందని
ఉచిత విద్య, వైద్యంపై తొలిసంతకం: బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు సహా అనేక విషయాల్లో లేని తప్పుల్ని భాజపాపై రుద్ది తెరాస ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం కేంద్రం పచ్చిబియ్యం, ఉప్పుడు బియ్యం కొంటుందని స్పష్టంచేశారు.కేంద్రం కొత్త నిబంధనలేం తేలేదని వెల్లడించారు. ఈ సంవత్సరం ఉప్పుడుబియ్యం ఇవ్వబోమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. హుజూరాబాద్ ఓటమి నుంచి దృష్టి మళ్లించడానికి మాటమార్చిందని ఆరోపించారు. ‘‘అగ్గి పెడతానంటూ దిల్లీ వెళ్లిన సీఎం ఏం చేశారు? యుద్ధం చేయాల్సింది పాకిస్థాన్ వంటి శత్రుదేశాలపై.. కేంద్రంపై చేస్తారా?’’ అని కిషన్రెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో శనివారం ఆయన ముగింపు ప్రసంగం చేశారు.
సీఎం ధర్నా రైతుల కోసం కాదు..
‘‘లేని సమస్యను సృష్టించి సీఎం ధర్నా చేశారు. కొడుకు సీఎం అవుతారో లేదోననే భయంతో కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ధర్నాచౌక్కు వచ్చారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం 2014లో రూ.3,600 కోట్లు ఖర్చు పెట్టింది. 2021లో రూ.26,600 కోట్లు వెచ్చించింది. చివరిగింజ వరకూ కొంటామన్న మీ ప్రగల్భాలు ఏమయ్యాయి? కేంద్రం రైల్వేలు, ఎల్ఐసీని అమ్మేస్తుందని కేసీఆర్ అంటున్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్న హామీని కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోలేదు? హుజూరాబాద్ ఎన్నిక అయిపోగానే దళితబంధును మరచిపోయారు. కుటుంబ పార్టీలు దేశానికి ప్రమాదకరం. దళిత సీఎంపై మాటతప్పి.. రాష్ట్రం ఆగమైపోవద్దనే అలా చేయలేదంటూ దళితుల్ని అవమానిస్తున్నారు. వారికి పరిపాలించే శక్తి లేదా?’’ అని కిషన్రెడ్డి అన్నారు.
సొంత పనులపైనే కేసీఆర్ దిల్లీకి
అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ‘కేసీఆర్ పతనం ప్రారంభమైంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఎన్నికలు ముందుగా వచ్చినా, 2023లో వచ్చినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే. వేదికపై ఉన్న మాలో ఎవరు ముఖ్యమంత్రి అయినా పేదలకు ఉచిత విద్య, వైద్యంపై తొలి సంతకం పెట్టించే బాధ్యత నాది’ అని అన్నారు. సీఎం దిల్లీకి వెళ్లి వచ్చింది సొంతపనుల కోసమేనని.. భాజపాను అప్రతిష్ఠపాలు చేసేందుకు, కేంద్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ సెంటిమెంట్ను రాజేసేందుకు యత్నించారని విమర్శించారు. ‘గడీల పాలననుంచి విముక్తికి ఉద్యమించే బాధ్యత నాది. త్యాగాలకు రక్తాన్ని ధారపోసేందుకు సిద్ధమా?’ అని కార్యకర్తల్ని ప్రశ్నించారు. ‘సీఎం కుర్చీ కోసం ప్రగతిభవన్లో కొట్లాట మొదలైంది’ అని అన్నారు.
హిందువులను ఒక్కటి చేస్తాం
తెలంగాణలో 80 శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారితే తెరాస, మజ్లిస్ కుట్రలు పటాపంచలై రాజ్యాధికారం పొందగలం. వచ్చే ఎన్నికల్లో హిందువుల్ని ఒక్కటి చేస్తాం. డిసెంబరు 17-20 మధ్య రెండోవిడత పాదయాత్ర ప్రారంభిస్తా’ అని సంజయ్ తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల రాజేందర్ను ఈ సందర్భంగా సన్మానించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాశ్, నేతలు కె.లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి విజయశాంతి, సంకినేని వెంకటేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యవర్గం తీర్మానాలు
* ఏడున్నరేళ్ల తెరాస పాలనలో రాష్ట్రం అన్నిరకాలుగా నష్టపోయింది. అవినీతి రాజ్యమేలుతోంది. దుబారా ఖర్చులు తగ్గించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి. భూమి, ఇసుక, మైనింగ్, మద్యం, మాదక ద్రవ్యాల మాఫియాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
* వర్షానికి తడిసిన వడ్లను కొనాలి. 60 లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి.
* దళితబంధురాష్ట్రమంతా అమలుచేయాలి. దళితుల కోసం రూ.60వేల కోట్ల టిప్రైడ్ నిధుల్ని వాడాలి.
* ధరణి వెబ్సైట్ లోపాల్ని సరిదిద్ది రైతులకు న్యాయంచేయాలి.
* ఖాళీ పోస్టులను భర్తీచేయాలి. ఒక్కో నిరుద్యోగికి 35 నెలల నిరుద్యోగభృతి రూ. 1,05,560 ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి