ఓ కన్నేసి ఉంచుదాం
తొలుత రుచి చూడాలనే తహతహతో మత్తు ఊబిలోకి దిగిన చాలామంది..క్రమంగా బానిసలుగా మారుతున్నారు. అప్పటికిగానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. వారికి తెలిసేసరికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో
గంజాయి సహా మాదకద్రవ్యాల వలలో యువత
తల్లిదండ్రులూ బహుపరాక్
తొలుత రుచి చూడాలనే తహతహతో మత్తు ఊబిలోకి దిగిన చాలామంది..క్రమంగా బానిసలుగా మారుతున్నారు. అప్పటికిగానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. వారికి తెలిసేసరికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆయా కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని, ప్రాథమిక దశలోనే పసిగట్టగలిగితే ‘మత్తు’ వదిలించేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతడు గంజాయి మత్తులో ఉన్నట్లు చికిత్సచేసే సమయంలో వైద్యులు గుర్తించారు. అప్పటివరకు తమ బిడ్డకు ఆ అలవాటు ఉన్నట్లు తెలుసుకోలేని తల్లిదండ్రులు నివ్వెరపోయారు. వైద్యుల సూచన మేరకు కుమారుడిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. అతడు మూడేళ్ల క్రితమే సిగరెట్లు, మద్యం తాగడం మొదలుపెట్టి ప్రస్తుతం గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల్ని తీసుకుంటున్నట్టు తేలింది. తరచూ గోవా నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టు అతడు నిపుణుల కౌన్సెలింగ్లో వెల్లడించాడని తెలుసుకుని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
జడలు విప్పుతున్న మత్తు మహమ్మారి కారణంగా ఇలాంటి అనుభవం ఎందరో తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో మత్తు పదార్థాల వినియోగం భారీగా పెరగడంతో యువత, ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఎక్కువగా మాదకద్రవ్యాల బారినపడ్డారు. లాక్డౌన్తో హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లిన ఇలాంటివారు..అక్కడి స్నేహితులకూ వీటిని అలవాటుచేశారు. ‘సులభంగా, చవగ్గా లభ్యమవడంతో మాదకద్రవ్యాల వ్యసనానికి గంజాయి గేట్వేలా మారిపోయిందని’ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇలాంటివి మీ ఇంట్లో జరుగుతున్నాయా?
* పిల్లలు ఇంట్లో తీసుకునే డబ్బులకు కచ్చితమైన లెక్కలు అడగాలి. తరచూ సాధారణం కంటే ఎక్కువ డబ్బులు అడుగుతుంటే అప్రమత్తమై ఆరా తీయాలి. ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో, వసతిగృహాల్లో ఉంటే వాటిని ఆకస్మికంగా సందర్శిస్తూ పరిస్థితుల్ని గమనించాలి. ఇంటికి తరచూ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో(మాట తడబాటు, కళ్లు ఎర్రబారడం, మగతగా అనిపించడం వంటివి) గమనించాలి.
* విద్యార్థుల బ్యాగుల్లో ఒ.సి.బి.పేపర్, లైటర్ తదితర వస్తువులుంటే గంజాయి తాగుతున్నట్టు అనుమానించాలి. ఎక్కువగా తినడం, ఎక్కువగా నిద్ర పోవడమూ గంజాయి తాగే వారి ప్రాథమిక లక్షణంగా గుర్తించాలి. బ్యాక్లాగ్స్ పెరిగినా కారణాలను అన్వేషించాలి.
* ముందు మీ పిల్లల స్నేహితులు ఎలాంటి వారో గమనించాలి. వారితో కలిసి టెర్రస్పై ఎక్కువ సమయం గడుపుతుంటే.. ఏం చేస్తున్నారో కనిపెట్టాలి. పుట్టినరోజు వేడుకలు, లేదా ఇతరత్రా సాకులతో తరచూ బయటకువెళ్లి ఎక్కువ సేపు గడుపుతుంటే అనుమానించాలి. పర్యవేక్షకులెవరూ లేకుండా గోవా లాంటి పర్యాటక ప్రాంతాలకు పంపేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.
* అనవసరంగా అరవడం, ముభావంగా ఉండటం లాంటి విపరీత ధోరణుల్ని వ్యక్తం చేస్తుంటే వారి చరవాణుల్లో వాట్సప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, టెలీగ్రామ్లాంటి యాప్లను తనిఖీ చేయాలి. సాధారణంగా ఇలాంటి వేదికల్లోనే డ్రగ్స్ కోసం సంభాషణలు సాగించే అవకాశముంది. చాటింగ్లలో weed, score, stuff,stamp, acid, paper, ocb, coke, MD, joint,stash, mal, khash, stoner, peddler, dum,crystal, boom లాంటి పదాలు ఎక్కువగా వాడుతుంటే అనుమానించాల్సి ఉంటుంది.
ఒకసారి రుచిచూస్తే.. అంతే సంగతులు
జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించకూడని అంశాల్లో మాదకద్రవ్యాలు మొదటి వరసలో ఉంటాయి. ఎక్కువసార్లు తీసుకుంటేనే వ్యసనపరులవుతామనేదీ అపోహే. ఒక్కడోసు కూడా ప్రమాదకరమే. మత్తుపదార్థాలు సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచుతాయనేది పచ్చి అబద్ధం. వాటిని తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదురవుతాయనేది మాత్రం వాస్తవం. గంజాయికి అలవాటుపడిన వారిని డీఅడిక్షన్ కేంద్రాల్లో చేర్చి దాన్నుంచి విముక్తుల్ని చెయ్యొచ్చు.
- అంజిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్ఫోర్స్మెంట్), హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసామాన్య అనన్య
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. -
గల్ఫ్ కార్మికులకు బోర్డు
గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
తెలంగాణ వైపు ఏనుగుల మంద!
మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
కేసుల వివరాలు అందించిన పోలీసులు
భాజపా తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. -
చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. -
వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా
ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే. -
ప్రచార రథంపై చెప్పుల దండ
ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. -
18 నుంచి సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-దానాపూర్ల మధ్య ఏప్రిల్, మే నెలల్లో అన్రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
విజయవాడ నుంచి హైదరాబాద్కు ఎయిర్ ఇండియా సర్వీస్
విజయవాడ-హైదరాబాద్ మధ్య మరో స్వదేశీ విమాన సర్వీసును నడిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ ముందుకొచ్చింది. -
సామరస్యానికి ప్రతీక శ్రీరామనవమి
రాష్ట్ర ప్రజలందరికీ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ప్రగాఢమైన భక్తితో దేశవ్యాప్తంగా జరుపుకొంటారని.. ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా ఈ పర్వదినం నిలుస్తోందని పేర్కొన్నారు. -
కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలున్నాయా?
‘మీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఎలా ఉంది? ఏమైనా సమస్యలున్నాయా? డబ్బులు ఖాతాల్లోకి జమయ్యాయా’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ రైతులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. -
సైబర్ నేరాలపై అన్నదాతలను అప్రమత్తం చేయాలి
సైబర్ నేరాలపై అన్నదాతలను అప్రమత్తం చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ సూచించారు. -
కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేం
ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) కేటగిరిలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించిన కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమంటూ మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. -
సంక్షిప్త వార్తలు(4)
తెలంగాణలో 45 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీని ఇవ్వాలని పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది. పీఆర్సీలో పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని అభ్యర్థించింది. -
జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం
రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. -
నిప్పుల గుండంలా రాష్ట్రం
శంకరపట్నం, కొడకండ్ల, న్యూస్టుడే: రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. మంగళవారం తొమ్మిది జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. -
అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా ఫుడ్పార్కు
మార్కెట్యార్డుల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, ఎండలకు వారు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.