కొక్కొరొకోతో కోట్లు
బీటెక్ పూర్తవగానే ఏదో ఒక సంస్థలో రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ గోమారం అచ్యుత్రెడ్డి (26) మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు.
సొంత బ్రాండ్తో నాటుకోడి గుడ్లు, మాంసం విక్రయాలు
దళారుల ప్రమేయం లేకుండా ప్రముఖ సంస్థలకు సరఫరా
యువ రైతు విజయ సూత్రం
ఈనాడు - సంగారెడ్డి
అచ్యుత్రెడ్డి ఫాంలో పెంచుతున్న నాటుకోళ్లు
బీటెక్ పూర్తవగానే ఏదో ఒక సంస్థలో రూ.లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని చాలామంది ఇంజినీరింగ్ విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ గోమారం అచ్యుత్రెడ్డి (26) మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన.. నాటుకోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. రుచికరమైన, నాణ్యమైన మాంసం, గుడ్లు అందిస్తే వ్యాపారానికి ఢోకా ఉండదని భావించారు. దళారుల చేతికి చిక్కకుండా సొంత బ్రాండ్లతో అమ్మకాలు సాగిస్తూ ఏటా రూ.కోట్ల టర్నోవర్తో విజయపథంలో పయనిస్తున్నారు. నాటుకోళ్ల పెంపకంపై ఇతర రైతులకు సైతం తన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తూ.. వారికీ గిట్టుబాటు అయ్యేలా చొరవ తీసుకుంటున్నారు.
2015లో మొదలుపెట్టి..
అచ్యుత్రెడ్డి హైదరాబాద్కు సుమారు 40 కి.మీ.ల దూరంలోని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండీ గ్రామంలో మూడెకరాల్లో 2015లో 5 వేల కోళ్ల పెంపకం మొదలుపెట్టారు. దళారుల ప్రమేయం ఉండొద్దన్న ఉద్దేశంతో సొంతంగా ‘న్యూట్రీఫ్రెష్’, ‘ఎపీక్యూర్’ బ్రాండ్ల పేరుతో గుడ్లు, మాంసం విక్రయాలు ప్రారంభించారు. ప్రచారానికి వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లనూ ఉపయోగించుకున్నారు. బుధ, శుక్ర, ఆదివారాల్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే తెచ్చి సరఫరా చేస్తారు. మాంసం విక్రయానికి లీషియస్, ఫిపొలా, టెండర్ కట్స్తో పాటు మరో మూడు సంస్థలతో అచ్యుత్రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతినెలా 1,500 కిలోల మాంసం, దాదాపు 10 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నారు. 250 మంది రైతులతోనూ ఒప్పందం చేసుకున్నారు. వారు సరఫరా చేసే కోళ్ల మాంసాన్ని తన బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు.
ప్రాసెసింగ్ చేసిన నాటుకోడి మాంసాన్ని చూపుతున్న అచ్యుత్రెడ్డి
సరైన మార్కెటింగ్ తోనే మంచి రాబడి
* కోళ్ల మార్కెటింగే అత్యంత కీలకం. ఇప్పటికే కోళ్లను పెంచుతున్న రైతుల అనుభవాలను తెలుసుకోవాలి. అవగాహనలేకుండా ప్రారంభిస్తే నష్టాలు తప్పవు.
* 5 వేల నాటుకోళ్లకు షెడ్డు ఏర్పాటు కోసం రూ.6.50 లక్షల నుంచి రూ.7.50 లక్షల ఖర్చవుతుంది. కోళ్లు సహజ వాతావరణంలో బయట తిరిగేందుకు కనీసం ఎకరా నుంచి మూడెకరాల వరకు స్థలం అవసరం.
* ఒక్కో కోడిపిల్ల ధర రూ.20 నుంచి రూ.40 వరకు ఉంటుంది. 5 వేల పిల్లల కొనుగోలుకు, వాటిని 90 నుంచి 100 రోజుల పాటు పెంచేందుకు రూ.9 లక్షల వరకు ఖర్చవుతుంది. అప్పటికి కిలోన్నర బరువు పెరుగుతాయి. దాదాపు 8,500 కిలోల కోళ్లు తయారవుతాయి. మార్కెట్లో కిలో కోడి(లైవ్) రూ.180 చొప్పున అమ్మినా దాదాపు రూ.15 లక్షలు వస్తాయి. రెండో విడత నుంచి పెట్టుబడి తిరిగివచ్చి.. లాభాల ఆర్జన మొదలవుతుందని అచ్యుత్రెడ్డి తెలిపారు.
అందిపుచ్చుకుంటే అవకాశాలెన్నో
- అచ్యుత్రెడ్డి
నాటుకోడి గుడ్లు, మాంసానికి ఉన్న డిమాండ్నే నేను అందిపుచ్చుకున్నా. సొంత బ్రాండ్లతో అమ్మకాలు చేపట్టడం కలిసొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల మార్కును దాటాం. ఈసారి రూ.10 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. 30 మందికి ఉపాధి కల్పిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ