ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం తీసుకురావాలి
ధాన్యం కొనుగోళ్లకు వార్షిక లక్ష్యం విధించాలని, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం తీసుకురావాలని తెరాస ఎంపీలు నినదించారు. ధాన్యం కొనుగోళ్లకు ఒకే దేశం- ఒకే విధానం ప్రకటించాలని కోరారు. ఏడాదికి ఎంత
పార్లమెంట్ లోపల, బయట తెరాస ఎంపీల ఆందోళన
ధాన్యం కొనుగోలుపైౖ పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్నేత, బీబీపాటిల్, బండా ప్రకాశ్, సురేశ్రెడ్డి, రాములు, కె.కేశవరావు, రంజిత్రెడ్డి, సంతోష్కుమార్
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లకు వార్షిక లక్ష్యం విధించాలని, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం తీసుకురావాలని తెరాస ఎంపీలు నినదించారు. ధాన్యం కొనుగోళ్లకు ఒకే దేశం- ఒకే విధానం ప్రకటించాలని కోరారు. ఏడాదికి ఎంత మొత్తం కొనుగోలు చేస్తామో ఒకసారి ప్రకటిస్తే అందుకు అనుగుణంగా రాష్ట్రాలు తమ వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకుంటాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెరాస ఎంపీలు ఆకుపచ్చ కండువాలు ధరించి లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ సెంట్రల్ హాలులో సోమవారం ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఉభయసభల వాయిదా తర్వాత పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద.., తెలంగాణ భవన్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎంపీలతో కలసి తెరాస పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు విలేకరులతో మాట్లాడారు.
కేంద్రం వివక్ష చూపుతోంది
‘‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో దుర్భర పరిస్థితి నెలకొంది. ఎంత సేకరించాలో చెప్పిన కేంద్రం ఇప్పుడు దానిని ఒప్పందం అంటోంది. తెలంగాణలో వేడి కారణంగా యాసంగి పంటలో బియ్యం విరుగుతాయి. అందుకే ఉప్పుడు బియ్యం వస్తాయి. రైతు బంధు, నీటివసతి, ఉచిత విద్యుత్తు సరఫరా వంటి కార్యక్రమాలతో తెలంగాణలో పంట ఉత్పత్తి బాగా పెరిగింది. ఈ వానాకాలంలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండింది. ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలి. తెలంగాణ నుంచి ధాన్యం కొనని కేంద్రం.. పంజాబ్నుంచి కొనుగోలు చేస్తూ తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. పంట మార్పిడికి కనీసం రెండేళ్ల సమయం అవసరం’’ అని కేకే అన్నారు.
చర్చకు నిరాకరించడంతోనే ఆందోళన: నామా
‘‘ధాన్యం కొనుగోళ్లపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు. మూడు సాగుచట్టాల రద్దు బిల్లుపై చర్చకు అవకాశమిస్తే ఈ సమస్యను లేవనెత్తుదామని భావించినా అదీ చేయలేదు. అందుకే ఆందోళన చేశాం. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు కేంద్రంతో చర్చలు జరుపుతుంటే పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తేవాలి. తెలంగాణ ఎంపీలంతా ఉభయ సభల్లో కలిసి పోరాడాలి. సభలో ఆందోళనకు కలసి రాకుంటే రానున్న కాలంలో మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు’’ అని కాంగ్రెస్, భాజపా ఎంపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యక్రమాల్లో లోక్సభ సభ్యులు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, శ్రీనివాస్రెడ్డి, రాములు, బి.బి.పాటిల్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్, సురేశ్రెడ్డి, జోగినపల్లి సంతోష్కుమార్ పాల్గొన్నారు.
సంజయ్ మెడలో కండువా వేసిన తెరాస ఎంపీ
ఉభయ సభల్లో, వెలుపల తెరాస ఎంపీలు ‘రైతులను శిక్షించొద్దు’ ‘రాష్ట్రాల మధ్య వివక్ష చూపొద్దు’, ‘జాతీయ ఆహారధాన్యాల సేకరణ విధానం ప్రకటించాలి’, ‘సేకరణలో ఏకరూపత పాటించాలి’ తదితర ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో భాజపా ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు తెరాస ఎంపీల వద్దకు వచ్చి గతంలో కేసీఆర్.. కేంద్రానికి అనుకూలంగా మాట్లాడిన అంశాలపై పత్రాలను ప్రదర్శించారు. వెంటనే స్పందించిన నామా నాగేశ్వరరావు.. సంజయ్ మెడలో ఆకుపచ్చ కండువా వేసి రైతుల పక్షాన మాట్లాడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
-
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు