నమ్ముకున్న పంటను అమ్ముకోలేక..
చేను విరగ్గాసి పంట చేతికి రాగానే కొండంత సంబరపడి.. దోసిట్లో బిడ్డను పట్టినట్లు అపురూపంగా పట్టుకుని బస్తాలకెత్తిన రైతన్న.. చంటిబిడ్డను సాకినట్లు మబ్బులు ఉరమగానే ఒకచోటి కుప్పను మరోచోటికి, అక్కడ తడిస్తే ఇంకోచోటికి మారుస్తూనే ఉన్నాడు. కొనుగోళ్లు మాత్రం ముమ్మరం కాలేదు.
నెలల తరబడి రైతులకు పడిగాపులే
తరుగు పెంచితేనే కొంటున్న మిల్లర్లు
నల్గొండ, భువనగిరి నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
తుక్కాపురం వద్ద కల్లంలోనే మొలకలు వచ్చిన ధాన్యం
చేను విరగ్గాసి పంట చేతికి రాగానే కొండంత సంబరపడి.. దోసిట్లో బిడ్డను పట్టినట్లు అపురూపంగా పట్టుకుని బస్తాలకెత్తిన రైతన్న.. చంటిబిడ్డను సాకినట్లు మబ్బులు ఉరమగానే ఒకచోటి కుప్పను మరోచోటికి, అక్కడ తడిస్తే ఇంకోచోటికి మారుస్తూనే ఉన్నాడు. కొనుగోళ్లు మాత్రం ముమ్మరం కాలేదు.
కల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యపురాశులే. వానకు తడుస్తున్నాయి. ఎండకు ఎండుతున్నాయి. దాదాపు నెలన్నర నుంచి రైతుల ఎదురుచూపులు. రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుల గోస ఇది. అసలే దిగుబడి తగ్గి ఆవేదనలో ఉన్న రైతులపై టార్పాలిన్లు, తూర్పార యంత్రాల భారమే తడిసి మోపడు అవుతోంది. చాలా కొనుగోలు కేంద్రాల్లో అధికారులు టార్పాలిన్లు ఇవ్వకపోవటంతో ధాన్యం తడవకుండా రైతులే వాటిని అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ధాన్యంలో తాలు తొలగించేందుకు తూర్పార యంత్రాల (ప్యాడీ క్లీనింగ్ మిషన్స్)ను ప్రభుత్వమే సమకూర్చాలి. యంత్రాలు అందుబాటులో లేక, ఉన్నవీ పనిచేయక రైతులు అద్దెకు తెచ్చుకోవడం చాలా జిల్లాల్లో ‘ఈనాడు’ దృష్టికి వచ్చింది. అకాలవర్షాలు, అదనపు భారంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సీజనులో ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువే కొన్నట్లు పౌరసరఫరాలశాఖ రికార్డులు చెబుతున్నా ధాన్యపు రాశులు మాత్రం తరగటం లేదు. అధికారులు పట్టించుకోరు.. వ్యాపారులది ఇష్టారాజ్యం. వెరసి రైతులది దయనీయ పరిస్థితి. వ్యాపారి చెప్పిన ధరకు ఒప్పుకొంటే.. అడిగినంత తరుగు ఇస్తే మాత్రమే ధాన్యం కాంటా మీదకు చేరుతుంది. లేదంటే ఎక్కడి బస్తాలు అక్కడే. వర్షం కురిస్తే తడిసి మొలకలు రావటం పరిపాటి అయింది. పోచంపల్లి కొనుగోలు కేంద్రంలో 360 మంది రైతులు దాదాపు లక్ష బస్తాల ధాన్యం తెచ్చి అక్టోబరు 7 నుంచి ఎదురుచూస్తున్నారు. మూడుసార్లు అకాల వర్షాలతో అవస్థలు పడ్డారు. తడిసిన ప్రతిసారీ సరకును మరో ప్రాంతానికి మార్చటం, ఆరబెట్టటం అధికారుల కోసం ఎదురుచూడడం మామూలైపోయింది. అధికారులు, మిల్లర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బేరాలు ఆడిన వారే తప్ప కొన్నది 20, 25 మంది ధాన్యమే. తరలింపునకు రవాణాదారులు బస్తాకు రూపాయన్నారు. ఇప్పుడు రూపాయిన్నర డిమాండు చేస్తున్నారు. 40 కిలోలకు 3, 4 కిలోలు తరుగు రూపంలో అదనంగా ఇస్తేనే కొంటామని మిల్లర్లు.. ఇలా రైతులను దోచుకునేందుకే చూస్తున్నారు. ఇది అన్యాయమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తూర్పారయంత్రానికి రైతులు చెల్లిస్తున్న అద్దె గంటకు రూ. 200
ఆ భారమూ రైతుపైనే..
కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు (పట్టాలు) ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదే. కానీ ఆ భారాన్ని రైతుల నెత్తినే రుద్దారు. రోజుకు ఒక్కో పట్టాకు రూ. 20 చెల్లించాలి. ఒక్కో ధాన్యపు కుప్పకు కనీసం 8 నుంచి 10 పట్టాలు అవసరం. ఇన్ని రోజులుగా రైతులపై ఎంత భారం పడిందో అర్థంచేసుకోవచ్చు. ధాన్యంలో తాలు, తప్ప లేకుండా ఉండేందుకు వాటిని తూర్పారబట్టాలి. ఆ యంత్రాలను అందజేయాల్సిందీ అధికారులే. ఇక్కడా చేతులెత్తేశారు. పెద్ద యంత్రమైతే గంటకు రూ. ఆరొందలు, చిన్న యంత్రమైతే గంటకు రూ. రెండొందలు చొప్పున రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఒక ఎకరా ధాన్యం తూర్పారబట్టటానికే రూ. వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి.
ప్రభుత్వ విత్తనాలు వేసినా కోతలేనా?
ప్రభుత్వం ఇచ్చిన విత్తులే వేశాం. ఇప్పుడేమో తేమ అంతుంది, ఇంతుంది అంటున్నారు. గత ఏడాది ఈ సమస్య రాలేదు. బస్తాకు మూడు, నాలుగు కిలోలు తరుగు తీస్తే మేమేం కావాలి? కుప్పలు పోసి రెండు నెలలైంది. పలుకుబడి ఉన్నోళ్లది తీసుకుంటున్నారు. మాలాంటి చిన్నోళ్లను పట్టించుకోవటం లేదు. వాళ్లకు లేని తరుగు మాకెందుకు వస్తోంది?
- రాసాల మహేష్, యాదాద్రి జిల్లా తుక్కాపురం
ఓపిక నశించింది...
- బొక్కా బాలిరెడ్డి, యాదాద్రి జిల్లా పోచంపల్లి
అయ్యా... ధాన్యం కొనండని ఎమ్మార్వో నుంచి కలెక్టరు ఆఫీసు దాకా తిరుగుతూనే ఉన్నాం. మిల్లర్లు తీసుకెళ్లిన ధాన్యాన్ని చిన్న యంత్రంలో వేస్తున్నారు. వారికి కావాల్సినంత వేగం పెట్టుకుంటున్నారు. నూకలు ఎక్కువ వస్తున్నాయంటూ తరుగు బేరమాడుతున్నారు. అడిగినంత ఇస్తేనే ధాన్యం దించుకుంటున్నారు. ఇదేంది సారూ అని అధికారులను అడిగితే సమాధానం ఉండదు. ఇవే అమ్ముడు పోలేదు. యాసంగి సంగతి యాదికి కూడా రావటం లేదు. పనులు చేయటానికి పైసలూలేవు. అప్పు ఇచ్చే వారూలేరు.ఓపిక పోయింది. భార్యా పిల్లలతో కలిసి రోడ్డెక్కుడే మిగిలింది.
ఇదేమి అన్యాయం?
- మేకల శివశంకర్, యాదాద్రి జిల్లా తుక్కాపురం
ఉన్న 12 ఎకరాల్లో వరి పండించాం. ధాన్యం తెచ్చి రెండు నెలలవుతోంది. పట్టించుకున్నోడు లేడు. తూర్పార యంత్రం అద్దె గంటకు రూ. 600. మనిషికి రూ.100. ధాన్యం తూర్పార పట్టేందుకే వేలు ఖర్చవుతోంది. ఈ మిషన్లు ఇయ్యాల్సింది ప్రభుత్వం. పట్టాలూ ప్రభుత్వమే ఇవ్వాలి. ఏదీ ఇవ్వలేదు. పట్టాలకూ వేలు కడుతున్నాం. యంత్రాలెందుకివ్వరంటే చెడిపోయాయంటున్నారు. ప్రభుత్వం ఏమి చేస్తుందో అర్థమైతలేదు. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన. ఉద్యోగం లేదు. వ్యవసాయం వల్ల నేనే కుటుంబానికి భారమైతున్నాను. ఏ కూలీయో చేసుకోవాలేమో. యాసంగిలో మినుములు, పల్లీలు వేస్తాం సరే.. కొంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. -
జపాన్లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు
జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్ట్) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం వెల్లడించింది. -
మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. -
మళ్లీ వరికే పెద్దపీట
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. -
చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!
కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు