రైతులను శిక్షించొద్దు
ధాన్యం కొనుగోళ్లపై తెరాస సభ్యులు వరుసగా మూడోరోజు బుధవారం కూడా ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించారు. ‘రైతులను శిక్షించొద్దు. కనీస మద్దతు ధర చట్టం తేవాలంటూ’ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.
ఉభయ సభల్లో తెరాస సభ్యుల ఆందోళన లోక్సభలో రోజంతా నిరసన
ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంటు సాక్షిగా హామీ ఇవ్వాలని డిమాండ్
ఇది మంచి సంప్రదాయం కాదు: తెరాస ఎంపీలపై స్పీకర్ మండిపాటు
తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతున్న కె.కేశవరావు, చిత్రంలో ఎంపీలు దయాకర్, జోగినపల్లి సంతోష్కుమార్, కె.ఆర్.సురేష్రెడ్డి, రంజిత్రెడ్డి, పి.రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, బి.బి.పాటిల్, నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, వెంకటేష్ నేత, ప్రభాకర్రెడ్డి
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై తెరాస సభ్యులు వరుసగా మూడోరోజు బుధవారం కూడా ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించారు. ‘రైతులను శిక్షించొద్దు. కనీస మద్దతు ధర చట్టం తేవాలంటూ’ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఉదయం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయం మొదలైనప్పట్నుంచి తెరాస సభ్యులు రైతులను ఆదుకోవాలనే డిమాండ్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని వెల్లో బైఠాయించి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సాయంత్రం సభ వాయిదా పడేవరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళనల మధ్యే కొద్దిసేపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగింది. రాజ్యసభలోనూ తెరాస సభ్యులు ఆందోళన చేశారు. సభల ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కూడా సభ్యులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో తెరాస సభ్యులపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యను ప్రస్తావించడానికి తగిన సమయం ఇవ్వడానికి సిద్ధమని చెప్పినా ఆందోళన చేయడం మంచిదికాదని హితవు పలికారు. ‘‘సభలో సీనియర్ సభ్యులు మాట్లాడుతుండగా వారి ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సమస్యపై మాట్లాడటానికి మంగళవారమే మీ పార్టీ నేతకు పూర్తిస్థాయి సమయం ఇచ్చాను. అయినప్పటికీ మీరు నినాదాలు చేయడానికి, ప్లకార్డులు ప్రదర్శించడానికి ఈ రోజు ఇక్కడికొచ్చారు. సభలో మీతీరు బాగాలేదు. కొందరు సభ్యులు పూర్తిసభను అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. సభ గౌరవ మర్యాదలు, సహకారంతో నడుస్తుంది. ఇలాంటి నిబంధనలకు విరుద్ధమైన విధానాలు, సంప్రదాయాలను అడ్డుకోవడానికి సభ్యులంతా సామూహికంగా ప్రయత్నించాలని కోరుతున్నానని’ స్పీకర్ అన్నారు. సభానాయకుడు తమ సభ్యులకు నచ్చజెప్పుకోవాలని సూచించారు.
రాజ్యసభ ఛైర్మన్ మండిపాటు
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. 12 మంది సభ్యుల సస్పెన్షన్ను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు, రైతు సమస్యలపై తెరాస సభ్యులు ప్లకార్డులతో వెల్లో నిరసన తెలపడంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ‘‘ఎంత చెప్పినా సభ్యుల్లో పశ్చాత్తాపం లేకపోవడం పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే. వెల్లోకి రావడం, బల్లలపైకి ఎక్కడం, కాగితాలు విసిరేయడం, మంత్రుల చేతుల్లోని కాగితాలు లాక్కోవడం, సభాధ్యక్షుడిని సవాల్ చేయడం వంటి చర్యలు పార్లమెంటు, ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకం. ప్లకార్డులు సభలోకి తీసుకురాకూడదు. అయినా తెస్తున్నారు. సభలో నిబంధనలకు వ్యతిరేకమైన ప్రవర్తనను చూడదలచుకోలేదు’’ అన్నారు. ఉభయ సభలు వాయిదాపడిన తర్వాత తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావులు.. ఇతర ఎంపీలతో కలిసి తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కిషన్రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు
- కె.కేశవరావు
ప్రతిగింజా కొంటామనే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నాం. అదే సమయంలో వానాకాలం పంట అంటూ కిషన్రెడ్డి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వానాకాలంతోపాటు యాసంగి పంట కూడా కొనాలి. వచ్చే ఏడాది కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలి. యాసంగి ధాన్యం సేకరణ అంశాన్ని కేరళ, తమిళనాడు, ఒడిశా ఎంపీలతో కలిసి గురువారం ఉభయ సభల్లో లేవనెత్తుతాం.
ఒక్కో మంత్రిది ఒక్కో మాటా?: నామా నాగేశ్వరరావు
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రతిగింజా కొంటామని చెబుతున్నారు. అదే అంశంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇవ్వాలి. ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి.. తలోమాట చెబుతున్నారు. పీయూష్ గోయల్ యాసంగి పంట కొనమని చెప్పిన తర్వాత సీఎం కేసీఆర్ అదే అంశాన్ని రైతులకు చెప్పారు. ఇప్పుడు ప్రతి గింజా కొంటామని కిషన్రెడ్డి హామీ ఇస్తుండడం, భాజపా నాయకులు కల్లాల వద్దకు వెళ్లి పంట కొనుగోలు చేస్తామని చెబుతుండడంతో గందరగోళం నెలకొంటోంది. ఈ అంశంపై భాజపా నాయకులు బయటచెప్పే మాటలనే పార్లమెంట్లో చెప్పిస్తే బాగుంటుంది. గతేడాది తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని కేంద్రం పార్లమెంట్లో చెప్పింది. ఈ ఏడాది 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం కోటి మెట్రిక్ టన్నులు కొనాలని విజ్ఞప్తిచేస్తే ‘మీ దగ్గర ఇంత ఎలా పండుతుందని’ పీయూష్ గోయల్ అవమానిస్తున్నారు. పంట ఎక్కువగా పండిస్తే ఆనందించాల్సిందిపోయి ఎదురు ప్రశ్నించడం సరికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్