ఖనిజాధారిత పరిశ్రమలకు పెద్దపీట
తెలంగాణలో ఖనిజాధారిత పరిశ్రమలను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లాలవారీగా వనరులపై నివేదిక రూపొందించింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించనుంది. తద్వారా రాష్ట్రానికి భారీగా
స్థాపనకు ముందుకొచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు, మౌలిక వసతులు
18 జిల్లాల్లో వనరుల గుర్తింపు
ప్రణాళిక రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో ఖనిజాధారిత పరిశ్రమలను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు జిల్లాలవారీగా వనరులపై నివేదిక రూపొందించింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహించనుంది. తద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు ప్రజలకు ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది. దేశంలోని భారీగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దీంతోపాటు దేశంలోని అల్యూమినియం సిలికేట్(క్యానైట్)లో 47 శాతం తెలంగాణలో లభిస్తోంది. 29 శాతం కోరండం, 10 శాతం సున్నపురాయి ఇక్కడే ఉంది. ఇవి కాకుండా బెరైటీస్, డోలమైట్, క్వార్ట్స్్జ, లేటరైట్ వంటి ఖనిజ సంపద రాష్ట్రంలో అపారంగా ఉంది. మరో 95 ఖనిజాలూ ఉన్నాయి. అంతర్జాతీయంగా పేరుగాంచిన నలుపు, గులాబీ, నీలం, రంగురంగుల రకాల గ్రానైట్ లభిస్తోంది. ప్రస్తుతం అనేక ఖనిజాలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. 18 జిల్లాల్లో ఖనిజ వనరులను గుర్తించింది. ఏయే జిల్లాలు ఏయే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమో ప్రణాళిక రూపొందించింది. వీటి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చింది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించనుంది. స్థానికంగా భూములను గుర్తించడంతో పాటు రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఏయే పరిశ్రమలకు అనుకూలం
* ఆదిలాబాద్: సిమెంట్, ఫెర్రో అల్లాయ్
* భద్రాద్రి-కొత్తగూడెం: బొగ్గు, రాగి, సీసం, రోడ్ మెటల్, మార్బుల్, సాధారణ ఇసుక యూనిట్లు, బొగ్గు ఆధారిత థర్మల్ పవర్, స్పాంజ్-ఐరన్ ప్లాంట్లు
* జయశంకర్: విద్యుత్ కేంద్రాలు, ఫ్లైయాష్ ఇటుకల తయారీ, హైడ్రేటెడ్ లైమ్, స్పాంజ్ ఐరన్ ప్లాంట్లు
* జగిత్యాల: గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు
* జోగులాంబ గద్వాల: క్రషింగ్ యూనిట్లు
* ఖమ్మం: స్పాంజ్ ఐరన్, థర్మల్ ప్లాంట్లు, ఉక్కు కర్మాగారం, గ్రానైట్, క్వార్ట్జ్ యూనిట్లు
* కుమురం భీం: సిరామిక్ పరిశ్రమలు
* మహబూబాబాద్: గ్రానైట్, పాలిషింగ్ యూనిట్లు
* మహబూబ్నగర్: గాజు, స్టోన్ క్రషింగ్ యూనిట్లు
* మంచిర్యాల: విద్యుత్ కేంద్రాలు, సిమెంటు, స్పాంజ్ ఐరన్
* నల్గొండ: యురేనియం శుద్ధి, సిమెంటు, జాగు(జాగ్వార్ స్టోన్), ఫెర్రో సిలికాన్, గ్రానైట్
* పెద్దపల్లి: థర్మల్ విద్యుత్, స్పాంజ్ ఐరన్
* సూర్యాపేట: సిమెంటు తయారీ, సున్నపురాయి శుద్ధి పరిశ్రమలు
* వికారాబాద్: సిమెంటు
* వరంగల్, హనుమకొండ జిల్లాలు: గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు
* యాదాద్రి: గ్రానైట్, స్టోన్ క్రషింగ్
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే