జల, విద్యుత్తు ప్రాజెక్టులకు రూ.1.63 కోట్ల రుణం
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన జల, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల ద్వారా ఇప్పటివరకు రూ.1,63,627 కోట్ల రుణం విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్తు
తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ తదితరాలకు పీఎఫ్సీ, ఆర్ఈసీ ద్వారా అప్పు అందించాం
కాళేశ్వరానికి వడ్డీ 9.2-11%.. 2022 అక్టోబరు నుంచి చెల్లింపులు
కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడి
ఈనాడు, దిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన జల, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)ల ద్వారా ఇప్పటివరకు రూ.1,63,627 కోట్ల రుణం విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కేసింగ్ తెలిపారు. గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఆర్ఈసీ ద్వారా కాళేశ్వరం, ఇందిరమ్మ ఫ్లడ్ఫ్లో కెనాల్, దేవాదుల ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతలు, పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి, పీఎఫ్సీ ద్వారా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు రుణం అందించాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు పీఎఫ్సీ ఇచ్చిన రుణంపై వడ్డీ 9.2% నుంచి 11%మేర ఉంది. రుణ కాలపరిమితి 12 ఏళ్లు. 2022 అక్టోబరు 15 నుంచి చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితుల కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణానికి పూచీకత్తు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు 7 లింకుల్లో సాగుతుంది. ఇప్పటివరకు మొదటి రెండు లింకులు 100% పూర్తయ్యాయి. మూడోది 76%, నాలుగోది 92%, అయిదోది 57%, ఆరోది 25%, ఏడోది 55% మేర పూర్తయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రుణంపై వడ్డీ 10.65% నుంచి 11% మేర ఉంది. రుణ కాల పరిమితి 15 ఏళ్లు. 2024 అక్టోబరు 15 నుంచి రుణ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం అయిదు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇప్పటి వరకు తొలిదశ 49%, రెండో దశ 70%, మూడో దశ 67%, నాలుగో దశ 52% పూర్తయింది. అయిదోది రాష్ట్ర ప్రభుత్వ అనుమతి దశలో ఉంది. దీనికి పీఎఫ్సీ ఎలాంటి రుణం అందించలేదు’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ.744 కోట్లతో ప్రతిపాదనలు
కేంద్ర రహదారి, మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 523 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.744 కోట్ల విలువైన 42 ప్రతిపాదనలు అందినట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్సభలో తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాల భూభాగం, ఇంధన వినియోగం సూత్రాల ఆధారంగా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్రం సీఆర్ఐఎఫ్ నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణకు 2021-22కి రూ.262.19 కోట్లు కేటాయించామన్నారు. 2022-23 తాలూకూ కేటాయింపులను వచ్చే ఏడాది ఖరారు చేస్తామన్నారు.
అంతరించే దశలో 117 భారతీయ భాషలు
అంతరించే దశలో 117 భారతీయ భాషలు ఉన్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. గురువారం రాజ్యసభలో తెరాస నేత కె.కేశవరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పదివేల మంది కంటే తక్కువ జనాభా మాట్లాడే భాషలను అంతరించే దశలో ఉన్నట్లు పరిగణిస్తున్నామని చెప్పారు. వీటి సంరక్షణకు మైసూరులోని భారతీయ భాషల సంస్థకు యూజీసీ రూ.45.89 కోట్లు ఇచ్చిందన్నారు.
పులుల గణనకు ప్రత్యేక యాప్
పులుల గణన(ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2022) కోసం ఎంస్ట్రైప్స్ (మానిటరింగ్ సిస్టం ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్) పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించినట్లు పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. తెరాస సభ్యుడు కె.ఆర్. సురేష్రెడ్డి గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.