మళ్లీ అలజడి
రాష్ట్రంలో మరోసారి కొవిడ్ అలజడి మొదలైంది. నాలుగు నెలలుగా నెమ్మదించిన కరోనా వైరస్ నెమ్మదిగా మళ్లీ జడలు విప్పుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించడంతో తిరిగి ఆందోళన ప్రారంభమైంది. కర్ణాటకలో తాజాగా
పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా 189 నమోదు
కొవిడ్ బారిన సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కుటుంబం
పొంచి ఉన్న ఒమిక్రాన్ ముప్పు
ఆరోగ్యశాఖ అప్రమత్తం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి కొవిడ్ అలజడి మొదలైంది. నాలుగు నెలలుగా నెమ్మదించిన కరోనా వైరస్ నెమ్మదిగా మళ్లీ జడలు విప్పుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించడంతో తిరిగి ఆందోళన ప్రారంభమైంది. కర్ణాటకలో తాజాగా రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఆ జాడలు కనిపించే అవకాశాలున్నాయా? అనే భయం వెన్నాడుతోంది. బుధవారం రెండు అంతర్జాతీయ విమానాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన వారిలో తెలంగాణకు చెందిన వారు 239 మంది, ఏపీకి చెందిన వారు 72 మంది, మహారాష్ట్రకు చెందినవారు 10 మంది, మధ్యప్రదేశ్కు చెందినవారు ఇద్దరు, ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక్కరు, రాజస్థాన్కు చెందిన ఒక్కరున్నారు. వీరి సమాచారాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నుంచి ఇతర రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు పంపించారు. నెగెటివ్గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికులను 14 రోజుల పాటు వైద్యసిబ్బంది నిరంతరం పరిశీలన జరుపుతారు. ఈ పరిశీలనలో భాగంగా 8వ రోజు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు. అందులో నెగెటివ్ వస్తే మరో 7 రోజుల పాటు హోం క్వారంటైన్లో పెట్టి, అప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే సాధారణ రాకపోకలకు అనుమతిస్తారు.
నిర్లక్ష్యంతో క్రమంగా పెరుగుతూ..
గత ఏడాది(2020) మార్చి 2న రాష్ట్రంలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. అదే ఏడాది మే, జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో విజృంభించింది. అక్టోబరు నుంచి నెమ్మదించిన కరోనా వైరస్ ఫిబ్రవరి వరకూ క్రమేణా తగ్గుముఖం పట్టింది. మార్చిలో డెల్టా వేరియంట్ ప్రభావం మొదలైంది. ఇక్కడి నుంచి ప్రారంభమైన రెండోదశలో డెల్టా వేరియంట్ కారణంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది జులై నుంచి రెండోదశ ఉద్ధృతి క్రమేణా తగ్గుముఖం పడుతూ వస్తోంది. నెమ్మదిగా సాధారణ జనజీవనం మొదలై కొవిడ్ నిబంధనలపై శ్రద్ధ తగ్గింది. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా.. గత 2 వారాలుగా క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ రోజుకు 180-200 వరకూ కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళనకర పరిణామమే. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు కొనసాగుతుండడం.. ఇదే సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో.. ఇప్పుడు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అతివేగంతోనే ఆందోళన
ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా వేరియంట్ కంటే ఆరింతలు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే నిర్ధారణ అయింది. కేవలం 3 రోజుల్లోనే 4 దేశాల నుంచి 24 దేశాలకు ఈ వేరియంట్ పాకింది. అంతర్జాతీయంగా ఒక పక్క కొవిడ్ నిబంధనలు కొనసాగుతుండగానే.. ఇంత వేగంగా వ్యాప్తి చెందడం గమనార్హం. ప్రస్తుతానికి ఈ వేరియంట్తో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నా.. దీనివల్ల ఎంత ముప్పు పొంచి ఉందనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో అప్రమత్తం
బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. నవంబరు 21-డిసెంబరు 1 మధ్య బ్రిటన్ నుంచి 1,778 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులను కేంద్రం తప్పనిసరి చేసింది. మిగిలిన దేశాలకు చెందిన వారిలో రెండు శాతం మందిని ఎంచుకుని పరీక్షలు చేస్తున్నారు. బుధవారం 303 మందిని పరీక్షించగా.. సదరు మహిళకు పాజిటివ్గా తేలింది.
డీఎంహెచ్వో కుటుంబంలో ఆరుగురికి వైరస్
సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్టుడే: సూర్యాపేట జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ కోటాచలం కొవిడ్ బారిన పడ్డారు. ఇటీవల ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులంతా తిరుపతికి వెళ్లి రెండు రోజుల క్రితం స్వగ్రామం తిరుమలగిరికి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకోగా ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. రెండురోజులుగా ఆయనను కలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 189 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,76,376కు పెరిగింది. మరో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 3,995కు చేరింది. తాజాగా 137 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకోగా.. మొత్తంగా 6,68,701 మంది ఆరోగ్యవంతులయ్యారు.
గురుకులాల్లో కలకలం
పటాన్చెరు, జూలూరుపాడు, జగిత్యాల న్యూస్టుడే: పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామం మహాత్మా జ్యోతిబా ఫులె బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలకు, జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తేల్చారు.మల్యాల సర్కిల్లో ఓ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు కొవిడ్ సోకింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ముగ్గురు విద్యార్థినులు కరోనా బారినపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం