పత్తి రైతుకు దుఃఖం
రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి నిరాశాజనకంగా ఉంది. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నా.. వర్షాలు, తెగుళ్లు రైతులను దెబ్బతీశాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేలకు పైగా ఉంది. కానీ దిగుబడి లేక రైతులు దిగాలుగా
ధర బావున్నా.. పడిపోయిన దిగుబడి
తెగుళ్లు, వర్షాలే కారణం
ఖమ్మం మార్కెట్కు అమ్మకానికి వచ్చిన పత్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి పంట దిగుబడి నిరాశాజనకంగా ఉంది. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నా.. వర్షాలు, తెగుళ్లు రైతులను దెబ్బతీశాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ధర రూ.8 వేలకు పైగా ఉంది. కానీ దిగుబడి లేక రైతులు దిగాలుగా ఉన్నారు. ఈ ఏడాది మొత్తం 46.50 లక్షల ఎకరాల్లో పంట సాగైతే దిగుబడి 31 లక్షల టన్నులొస్తుందని అర్ధ, గణాంక, మార్కెటింగ్ శాఖ తొలుత అంచనా వేసింది. ఇప్పటివరకూ అందులో 10 శాతం అంటే 3.10 లక్షల టన్నులు మాత్రమే మార్కెట్లకు వచ్చింది. గతేడాది ఈ సమయానికి 5.69 లక్షల టన్నుల పత్తి పంట మార్కెట్లకు వస్తే ఈ ఏడాది అందులో 55 శాతంలోపే మార్కెట్లకు రావడం గమనార్హం.
దెబ్బతీసిన వాతావరణం
రాష్ట్రంలో పత్తి పంటకు ప్రస్తుత వాతావరణం శాపంగా మారింది. జూన్ 5న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించగా.. పలు ప్రాంతాల్లో రైతులు పెద్దఎత్తున పత్తి విత్తనాలు నాటారు. అదే నెలలో వర్షాలు మొదలై ఆగస్టు రెండోవారం వరకు ఏకధాటిగా కురిశాయి. అధిక తేమ కారణంగా పత్తి మొక్కలు చనిపోయాయి. మళ్లీ రైతులు విత్తనాలు నాటారు. తొలకరి ముందుగా రావడంతో పత్తి సాగు విస్తీర్ణం 75 లక్షల ఎకరాలకు చేరుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసినా.. అధిక వర్షాలతో 46.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. తెలంగాణలో దిగుబడి 30 లక్షల బేళ్లకు మించి రాకపోవచ్చని.. గతేడాది 44 లక్షల బేళ్లు వచ్చిందని రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.రమేశ్ ‘ఈనాడు’కు చెప్పారు. వర్షాలు రైతులను బాగా దెబ్బతీశాయని మార్కెటింగ్శాఖ రాష్ట్ర సంచాలకురాలు లక్ష్మీబాయి చెప్పారు. రాష్ట్రంలో పెద్దదైన ఖమ్మం మార్కెట్కు గతేడాది ఈ సమయానికి 2,02,358 క్వింటాళ్ల పత్తిని రైతులు తీసుకురాగా.., ఈసారి ఇప్పటికి 1,35,770 క్వింటాళ్లే వచ్చిందని ఖమ్మం మార్కెటింగ్శాఖ కార్యదర్శి మల్లేశం తెలిపారు.
సాగు ఖర్చులు కూడా రాలేదు
ఈయన పేరు సీతారాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామం. పదెకరాల్లో పత్తి సాగుచేశారు. వర్షాలు, తెగుళ్ల కారణంగా ఎకరానికి 2 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. రూ.15 వేల నుంచి 20 వేలు మాత్రమే ఆదాయం వచ్చింది. ప్రైవేటు అప్పులు తెచ్చి పంట సాగుకు పెట్టుబడులు పెడితే చివరికి పంట ఖర్చులు కూడా తిరిగి రాలేదు.
పంటను దున్నేస్తున్నారు
పత్తి పంటను దున్నేస్తున్న రైతు పేరు ఎం.డి.ఖాజా. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామం. ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. అధిక వర్షాలతో 10 క్వింటాళ్లకు.. 2 క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. ప్రస్తుతం గులాబీ పురుగు ఉద్ధృతంగా ఉండడంతో పంటపై ఆశలు వదులుకొని పంట తొలగించారు. ఎకరాకు రూ.26 వేలు పెట్టుబడి కాగా.. పత్తిని మార్కెట్లో విక్రయిస్తే రూ.14 వేలు మాత్రమే వచ్చింది.
దేశంలో పరిస్థితి ఇదీ...
ఈ ఏడాది దేశంలో 3.60 కోట్ల బేళ్ల పత్తి దిగుబడి వస్తుందని భారత పత్తి వ్యాపారుల సంఘం అంచనా. గతేడాది వచ్చిన 3.53 కోట్ల బేళ్లకన్నా ఈసారి మరో 7 లక్షల బేళ్లు అదనం. (170 కిలోల దూదిని బేలు అంటారు). గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలలో పత్తి పంట బాగుందని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో గతేడాది 16 లక్షల బేళ్లు రాగా.. ఈ ఏడాది 14 లక్షల బేళ్లు రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’