అనుచిత ప్రవర్తనను అడ్డుకోవడం అప్రజాస్వామికమా!
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎగువ సభ కార్యకలాపాలకు తీవ్ర అవరోధం కలగడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల అనుచిత ప్రవర్తనను అడ్డుకోవడం
1962-2010 మధ్య 11 సందర్భాల్లో సభ్యులపై చర్యలు
అవన్నీ సమర్థనీయం కాకుంటే అన్నిమార్లు ఎందుకు చేశారు!
ఎంపీల సస్పెన్షన్పై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
సభను అపవిత్రం చేసే చర్యలను ప్రజాస్వామ్యమని.. వాటిని నిరోధించడం అప్రజాస్వామ్యమని ప్రచారం చేయడం దురదృష్టకరం. దేశ ప్రజలు ఇలాంటి కొత్త పోకడలను సమర్థించరని విశ్వసిస్తున్నా.
- రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు
దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎగువ సభ కార్యకలాపాలకు తీవ్ర అవరోధం కలగడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల అనుచిత ప్రవర్తనను అడ్డుకోవడం అప్రజాస్వామికం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 12 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ సభలో వరుసగా నాలుగో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. వీటి కారణంగా గురువారం సమావేశం ప్రారంభమైన వెంటనే రాజ్యసభ 50 నిమిషాల పాటు వాయిదా పడింది. ‘‘12 మంది సభ్యుల సస్పెన్షన్ను విపక్ష నేతలు అప్రజాస్వామ్యంగా ఎలా అభివర్ణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తీర్మానాలను కొనసాగించడం కోసం 1962 నుంచి 2010 వరకు 11 సందర్భాల్లో అవరోధం కలిగిస్తున్న సభ్యులను సస్పెండ్ చేశారు. అవన్నీ అప్రజాస్వామిక చర్యలేనా? అలాగైతే.. అన్నిసార్లు సభ్యులను ఎలా సస్పెండ్ చేశారు’’అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు.. సస్పెన్షన్ విధించటానికి దారితీసిన కారణాలపై సభలో కానీ, వెలుపల కానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆక్షేపించారు. ‘తమ అనుచిత ప్రవర్తనపై సభ్యులు కనీసం మీడియా సమావేశాల్లో కూడా విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరం. క్షమాపణ కోరకుంటే సభా నిబంధనల ప్రకారం వారిపై సస్పెన్షన్ను ఎత్తివేయడం సాధ్యంకాద’ని పేర్కొన్నారు. అధికార, విపక్ష సభ్యులు చర్చించుకొని ప్రస్తుత ప్రతిష్టంభనను తొలగించేంద]ుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. సభ్యుల సస్పెన్షన్ అంశంపై మాట్లాడేందుకు విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయగా వెంకయ్యనాయుడు నిరాకరించారు. దీనిపై ఖర్గే ఇప్పటికే మాట్లాడారని తెలపడంతో కాంగ్రెస్ సభ్యులు సభామధ్యంలోకి దూసుకెళ్లారు.
గురువారం రాజ్యసభలో చర్చలు
ఆనకట్టల భద్రత బిల్లుకు ఆమోదం
దేశంలో ఎంపిక చేసిన ఆనకట్టల భద్రత పర్యవేక్షణ, నిర్వహణ, వాటిపై నిరంతర నిఘాకు సంస్థాగతమైన యంత్రాంగం ఏర్పాటు కోసం రూపొందించిన బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్న ఈ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపించాలని చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం సభ్యులు దీనిపై చర్చించారు. బిల్లులోని నిబంధనలను మార్చాల్సి ఉందని, దానిని సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ డీఎంకే నేత తిరుచ్చి శివ సవరణలను ప్రతిపాదించారు. ఆనకట్టల భద్రత కోసం ఏర్పాటు చేసే జాతీయ స్థాయి కమిటీ, అధికార యంత్రాంగం నియంత్రణ మొత్తం కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉంటుందన్నారు. కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు కూడా బిల్లుకు సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం, ఏఐడీఎంకే, ఆర్జేడీ, ఎండీఎంకే సభ్యులు బిల్లును పూర్తిగా వ్యతిరేకించారు. సెలెక్టు కమిటీకి పంపించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా 80 ఓట్లు రాగా అనుకూలంగా 26 ఓట్లే వచ్చాయి. సవరణలు చేసినందున ఈ బిల్లును మరోసారి లోక్సభకు పంపించనున్నారు.
పార్లమెంటు ఎదుట ధర్నాలో ప్రతిపక్ష సభ్యులతో కలిసి కూర్చొన్న రాహుల్గాంధీ
మద్దతుధరలపై వాకౌట్
అధిక ధరలు, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ అంశాలపై చర్చించాలన్న డిమాండ్ను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో తొలుత కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోగా టీఎంసీ, తెరాస, డీఎంకే, వామపక్షాల సభ్యులూ వారిని అనుసరించారు. రైతుల సమస్యలపై నిరసనను తెరాస సభ్యులు లోక్సభలో గురువారం కూడా కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడలేదు. ప్రస్తుత సమావేశాల్లో లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా కొనసాగడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పర్యాటకం...’ పక్కా నాటకం!
జగన్ ప్రభుత్వంలో పర్యాటక రంగం అభివృద్ధికి అప్పులివ్వడానికి బ్యాంకులే కాదు... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకు రాలేదు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
బస్సులు సీఎం సభకు.. కష్టాలు ప్రయాణికులకు
ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు తరలించడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రయాణికులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
మూడు రాజధానులు ఏర్పాటు చేశాం
‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కరవును కళ్లారా చూడు జగనన్నా
‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
అంత తొందరెందుకు?
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 21 మంది సహాయ ఆచార్యులకు ఉన్నతి కల్పిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పాకశాస్త్ర కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తిరుపతిలోని భారత పాకశాస్త్ర సంస్థ (ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్)లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ శిక్షణ, ప్లేస్మెంట్ అధికారి చెల్లేశ్వరరావు తెలిపారు. -
ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
దేవాదాయశాఖ కమిషనర్పై సుమోటో కోర్టుధిక్కరణ కేసు
దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణపై సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదుచేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
స్కిల్ కేసులో రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు