అయ్యో పాపం.. కుటుంబం అంతమాయె!
ఆస్తిపాస్తులు కలిగిన ముచ్చటైన కుటుంబం. ఇప్పటికే రెండు ఇళ్లున్నాయి. ఇటీవలే కొత్తగా మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. దీని కోసం చేసిన అప్పులు తీర్చే విషయంలో తలెత్తిన వివాదాలు ....
నలుగురిని మింగిన అప్పులు.. వివాదాలు
ఉరి వేసుకున్న భర్త.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన భార్య
సంగారెడ్డి జిల్లాలో విషాదం
ఈనాడు, సంగారెడ్డి, న్యూస్టుడే, జోగిపేట టౌన్, రామచంద్రాపురం: ఆస్తిపాస్తులు కలిగిన ముచ్చటైన కుటుంబం. ఇప్పటికే రెండు ఇళ్లున్నాయి. ఇటీవలే కొత్తగా మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. దీని కోసం చేసిన అప్పులు తీర్చే విషయంలో తలెత్తిన వివాదాలు ఆ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. భర్త ఆత్మహత్య చేసుకోగా.. భార్య పిల్లలిద్దరిని చెరువులో తోసి తానూ తనువు చాలించింది.సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాదఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ కొత్త ఎంఐజీ కాలనీలో ఉండే చంద్రకాంత్ (38) టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకు రూ.70 వేల వరకు జీతం వస్తోంది. భార్య లావణ్య. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రథమ్ (9), సర్వజ్ఞ (14 నెలలు). వీరికి ఇదే కాలనీలో రెండు ఇళ్లున్నాయి. రెండేళ్ల క్రితం ఆశోక్నగర్లో మూడంతస్తుల కొత్త ఇల్లు నిర్మించారు. ఇందుకోసం తీసుకున్న అప్పులు, చెల్లించాల్సిన నెలసరి వాయిదాల విషయమై ఏడాదిగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.
ఇంట్లోనే ఉరేసుకున్న చంద్రకాంత్
ఇల్లు కట్టేందుకు చేసిన అప్పులతో పాటు క్రెడిట్ కార్డు బకాయిలకు సంబంధించిన చెల్లింపులపై ఇంట్లో తరచూ వాగ్వాదాలు జరిగేవి. అప్పులతో తనకేం సంబంధం లేదని, ఆ కష్టమంతా మీరేపడండని చంద్రకాంత్ తండ్రి నాగేశ్వరరావు చెప్పడం.. మరికొన్ని ఇతర కారణాలు చివరికి నలుగురి ప్రాణాలకు తీశాయి. అమీన్పూర్లో తండ్రి కొత్తగా కొన్న ఇంటి గృహప్రవేశానికి వెళ్లిన లావణ్య ఈనెల 2న సాయంత్రం పిల్లలను తీసుకొని తమ ఇంటికి వెళ్లింది. అప్పటికే భర్తకు, మామకు మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె భర్త చంద్రకాంత్ తాను చనిపోతే ఈ సమస్యలన్నీ ఉండవంటూ మాట్లాడారు. ఈ పరిణామంతో లావణ్య ఇద్దరు పిల్లలను తీసుకొని ..‘ఎవరెందుకు చావాలి? మేమే వెళ్లిపోతామ’ంటూ బయటకు వచ్చేసింది. ముత్తంగి వరకు వచ్చిన తర్వాత రోడ్డుమీద వెళుతున్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకొని తమ పక్కింటి వారికి ఫోన్ చేసింది. ‘నీ భర్త ఉరేసుకుని చనిపోయాడని’ వారు చెప్పగానే నిర్ఘాంతపోయింది. తనకు కొంత డబ్బు కావాలని ఫోన్ ఇచ్చిన వ్యక్తిని అడగ్గా.. తన వద్దలేవంటూ ఆయన సమాధానమిచ్చారు. దీంతో నడచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. అప్పటికే తన చెల్లి కనిపించడం లేదని ఆమె సోదరి సౌజన్య రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా వెతికినా ఆచూకీ తెలియలేదు. శుక్రవారం ఉదయం అందోలులోని పెద్ద చెరువులో ఒక మహిళ, బాబు శవాలు తేలాయి. చెరువులో పడి చనిపోయింది లావణ్య, ఆమె ఇద్దరు పిల్లలేనని పోలీసులు నిర్ధారించారు. తన కుమారుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చంద్రకాంత్ మృతదేహానికి పటాన్చెరులో, లావణ్య, ఇద్దరు పిల్లల మృతదేహాలకు జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించారు.
ఏడాదికాలంలో రూ.42 లక్షలు ఇచ్చా
తన కూతురు సంసారం బాగుండాలని ఏడాదికాలంలో రూ.42 లక్షలు చంద్రకాంత్కు ఇచ్చానని లావణ్య తండ్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేంద్రప్రసాద్రావు తెలిపారు. తమ వియ్యంకుడి వ్యవహారశైలి వల్లే ఈ దారుణం చోటు చేసుకుందన్నారు. గతంలోనూ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తన కుమార్తె చెప్పిందన్నారు. అందుకే వారికి అండగా నిలిచే ప్రయత్నం చేశానన్నారు. అయినా తన కుమార్తె కుటుంబం ఇలా ఆగమైపోయిందని ఆయన విలపించారు.
నాలుగు రోజుల క్రితమే నచ్చజెప్పి వచ్చా
నేను నాలుగు రోజుల క్రితమే వాళ్ల ఇంటికి వెళ్లి వచ్చా. లావణ్య దంపతులతో పాటు నాగేశ్వరరావుతో విడివిడిగా మాట్లాడాను. తక్షణం చెల్లించాల్సిన అప్పులు రూ.15 లక్షల వరకు ఉన్నాయని చంద్రకాంత్ చెప్పాడు. వారికి మునిపల్లి మండలంలో 12 ఎకరాల భూమి ఉంది. రెండెకరాలు అమ్మి అప్పులు తీర్చుకోవాలని సలహా ఇచ్చా. అందుకు వాళ్ల తండ్రి నాగేశ్వరరావు ఒప్పుకోలేదు. పైగా లావణ్య, చంద్రకాంత్లను తన ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నారు. చివరకు వారు లోకాన్నే విడిచిపెట్టి వెళ్లారు.
- మధుసూదన్రావు, లావణ్య బాబాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్