ముందు ఇవ్వాల్సింది ఇవ్వండి
తెలంగాణ ఎంపీలు బియ్యం సేకరణ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని రాజ్యసభాపక్షనేత, కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్గోయల్ ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్లో హామీ ...
తెలంగాణ నుంచి 29 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి
కేంద్ర మంత్రి గోయల్ స్పష్టం
ఈనాడు, దిల్లీ: తెలంగాణ ఎంపీలు బియ్యం సేకరణ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని రాజ్యసభాపక్షనేత, కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్గోయల్ ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్లో హామీ ఇచ్చిన దానికంటే 29 లక్షల టన్నులు తక్కువగా తెలంగాణ రాష్ట్రం బియ్యం సరఫరా చేసిందని, ముందు ఈ లోటును భర్తీచేసి భవిష్యత్తు గురించి అడగాలని హితవుపలికారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఆ పార్టీ ఎంపీ కె.ఆర్. సురేష్రెడ్డి బియ్యం సేకరణ లక్ష్యాల గురించి స్పష్టతనివ్వాలని కోరుతూ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఏటా బియ్యం సేకరణను పెంచుతూపోతోంది. తెలంగాణలోనూ బియ్యం సేకరణను 51.9 లక్షల టన్నుల నుంచి 94.54 లక్షల టన్నులకు పెంచాం. తెలంగాణ నుంచి 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో 50 లక్షల టన్నులు ఇస్తామని హామీఇచ్చి, 32.66 లక్షల టన్నులే ఇచ్చారు. రబీ సీజన్లో 55 లక్షల టన్నులు అంచనా వేసి, 61.8 లక్షల టన్నులు సేకరించారు. మొత్తంగా 94.53 లక్షల టన్నుల వరకు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లుచెప్పాం. ఆ రెండు సీజన్లకు సంబంధించి ఇంకా 29 లక్ష టన్నులు ఇంకా ఇవ్వాల్సి ఉంది. వాస్తవంగా తెలంగాణ నుంచి సేకరించాల్సిన ఉప్పుడు బియ్యం లక్ష్యం 24.75 లక్షల టన్నులు మాత్రమే. వాళ్లు వచ్చి అడిగితే ఏకకాల పరిష్కారం కింద లక్ష్యాన్ని 44.75 లక్షల టన్నులకు పెంచాం. అందులోనూ ఇప్పటివరకూ 27.78 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా దాదాపు 17 లక్షల టన్నులు రావాల్సి ఉంది.’’ అని అన్నారు.
ఎఫ్సీఐ ముందే చెప్పింది కదా?
ఈ రబీ సీజన్కు సంబంధించి ఎంత పరిమాణంలో బియ్యం కొంటారో స్పష్టంగా చెప్పాలంటూ కేశవరావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ‘‘ప్రస్తుత సీజన్లో మీరు సరఫరా చేస్తామని చెప్పిన బియ్యమే పూర్తిగా ఇవ్వలేదు. అందువల్ల పెండింగ్లో ఉన్న 29 లక్షల టన్నులు ప్రస్తుతం ఇవ్వమని అడుగుతున్నాం. అది సేకరించిన తర్వాత కూడా ఇంకా ఏదైనా సమస్య ఉంటే వాళ్లు ప్రభుత్వాన్ని అడగొచ్చు. ’’ అని సమాధానమిచ్చారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు గురించి ఒడిశా బీజేడీ సభ్యుడు సస్మిత్పాత్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ ‘‘ఎంఓయూ క్లాజ్ 18లో టీపీడీఎస్ కింద కేటాయించిన పరిమితులకు మించి రాష్ట్రాలు అధికంగా బియ్యం సేకరిస్తే దాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలని చెప్పాం. అలా అప్పగించేది ఉప్పుడు బియ్యంగా ఉండాలా? ముడిబియ్యంగా ఉండాలా? అనేది చెప్పే అధికారం ఎఫ్సీఐకి ఉంటుందని చెప్పాం. అందుకే ఎంఓయూలో దేశీయ అవసరాలకు తగ్గ బియ్యం మాత్రమే సరఫరా చేయాలనే నిబంధనను ఎఫ్సీఐ నిర్దేశించింది’’ అని పేర్కొన్నారు. నిల్వల్లో లోపాలున్నాయని కేంద్రమంత్రి తప్పుగా చెప్పారని కె.ఆర్. సురేష్రెడ్డి అనగా పీయూష్గోయల్ దానికీ వివరణ ఇచ్చారు. ‘‘నిల్వల్లో ఉన్న లోపాల గురించి నేను ఇప్పటికే రాష్ట్ర మంత్రికి లేఖ రాశాను. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో నిల్వ 25,303 మెట్రిక్ టన్నులు తక్కువగా కనిపించింది’’ అని తెలిపారు.
లేఖ ఇచ్చి ఇప్పుడిలా ఎందుకు?
భవిష్యత్తులో ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని తెలంగాణ ప్రభుత్వమే అంగీకరించినట్లు పీయూష్ గోయల్ మరోసారి స్పష్టంచేశారు. ‘‘భవిష్యత్తులో ఎఫ్సీఐకి ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని అక్టోబరు 4న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం