ఎన్కౌంటర్ ప్రదేశానికి సిర్పుర్కర్ బృందం
దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ వివరాల సేకరణకు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎన్కౌంటర్ జరిగిన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలికలోని చటాన్పల్లికి కమిషన్ ఛైర్మన్ సిర్పుర్కర్,
దిశ అత్యాచారం జరిగిన తొండుపల్లిలోనూ పరిశీలన
కమిషన్ను రద్దు చేయాలని షాద్నగర్ పోలీస్స్టేషన్ ఎదుట సంఘాల ఆందోళన
షాద్నగర్లో జస్టిస్ సిర్పుర్కర్
షాద్నగర్ న్యూటౌన్, శంషాబాద్, న్యూస్టుడే: దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ వివరాల సేకరణకు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎన్కౌంటర్ జరిగిన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలికలోని చటాన్పల్లికి కమిషన్ ఛైర్మన్ సిర్పుర్కర్, సభ్యులు జస్టిస్ రేఖాసుందర్, కార్తికేయన్లు పటిష్ఠ భద్రత మధ్య ఉదయం 11.30 గంటలకు చేరుకున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన నలుగురు నిందితులు పడిపోయిన స్థలాలను పరిశీలించి పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దిశను దహనం చేసిన ప్రాంతం నీటిలో మునిగిపోవడంతో దూరం నుంచే పరిశీలించారు. గంటకుపైగా ఆ ప్రాంతంలో ఉన్నారు. అనంతరం షాద్నగర్ పోలీసుస్టేషన్కు చేరుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సమాచారం తెలుసుకున్న పలు సంఘాల, పార్టీల నాయకులు.. స్టేషన్ వద్దకు చేరుకుని కమిషన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ ఆందోళన కొనసాగుతుండగానే కమిషన్ బృందం.. అత్యాచార ఘటన జరిగిన శంషాబాద్ మండలం తొండుపల్లి వెళ్లింది. దిశ తన మోటర్ సైకిల్తో నిలిచిన ప్రాంతం, అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది. అనంతరం వారంతా అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. డిసెంబరు 6, 2019లో ఈ ఎన్కౌంటర్ జరగ్గా.. ఇప్పటికి రెండేళ్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న కమిషన్ సభ్యులు విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు.
జస్టిస్ సిర్పుర్కర్ను కలిసేందుకు దిశ తండ్రి ప్రయత్నం!
కమిషన్ బృందం తొండుపల్లికి చేరుకున్న సమయంలో దిశ తండ్రి అక్కడకు వచ్చారు. జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ను కలిసేందుకు 15 నిమిషాల పాటు అక్కడే ఎదురు చూశారు. అయితే ముందస్తు అనుమతి లేకపోవడంతో వారిని కలవడం సాధ్యపడలేదని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అసామాన్య అనన్య
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. -
గల్ఫ్ కార్మికులకు బోర్డు
గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
తెలంగాణ వైపు ఏనుగుల మంద!
మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
కేసుల వివరాలు అందించిన పోలీసులు
భాజపా తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. -
చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. -
వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా
ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే. -
ప్రచార రథంపై చెప్పుల దండ
ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. -
18 నుంచి సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-దానాపూర్ల మధ్య ఏప్రిల్, మే నెలల్లో అన్రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
విజయవాడ నుంచి హైదరాబాద్కు ఎయిర్ ఇండియా సర్వీస్
విజయవాడ-హైదరాబాద్ మధ్య మరో స్వదేశీ విమాన సర్వీసును నడిపేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ ముందుకొచ్చింది. -
సామరస్యానికి ప్రతీక శ్రీరామనవమి
రాష్ట్ర ప్రజలందరికీ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ప్రగాఢమైన భక్తితో దేశవ్యాప్తంగా జరుపుకొంటారని.. ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా ఈ పర్వదినం నిలుస్తోందని పేర్కొన్నారు. -
కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలున్నాయా?
‘మీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఎలా ఉంది? ఏమైనా సమస్యలున్నాయా? డబ్బులు ఖాతాల్లోకి జమయ్యాయా’ అని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ రైతులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. -
సైబర్ నేరాలపై అన్నదాతలను అప్రమత్తం చేయాలి
సైబర్ నేరాలపై అన్నదాతలను అప్రమత్తం చేయాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ సూచించారు. -
కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేం
ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) కేటగిరిలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించిన కనీస అర్హత మార్కుల్లో జోక్యం చేసుకోలేమంటూ మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. -
సంక్షిప్త వార్తలు(4)
తెలంగాణలో 45 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీని ఇవ్వాలని పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది. పీఆర్సీలో పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని అభ్యర్థించింది. -
జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం
రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. -
నిప్పుల గుండంలా రాష్ట్రం
శంకరపట్నం, కొడకండ్ల, న్యూస్టుడే: రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. మంగళవారం తొమ్మిది జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా భద్రాచలం పట్టణంలో 44.7 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. -
అంతర్జాతీయ ప్రమాణాలతో మెగా ఫుడ్పార్కు
మార్కెట్యార్డుల్లో రైతులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని, ఎండలకు వారు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.