రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు
కొత్త జోనల్ విధానం మేరకు తెలంగాణలోని ఉద్యోగులను వారి సొంత జిల్లాలు, జోన్లకు బదలాయింపు కోసం గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రభుత్వం
నేడు సీనియారిటీ జాబితాల ప్రదర్శన
11 నుంచి 15 వరకు జిల్లా కమిటీల సమావేశాలు
15 నుంచి కేటాయింపుల ఉత్తర్వులు
బదలాయింపు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: కొత్త జోనల్ విధానం మేరకు తెలంగాణలోని ఉద్యోగులను వారి సొంత జిల్లాలు, జోన్లకు బదలాయింపు కోసం గురువారం ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. దీని ప్రకారం బుధవారం వరకు సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి, తమ కార్యాలయాలు, కలెక్టరేట్లలో ఉన్నతాధికారులు ప్రదర్శించాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహాయించి... వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఉద్యోగుల నుంచి బదిలీల కోసం ఐచ్ఛికాలను స్వీకరిస్తారు. పదో తేదీన ఈ దరఖాస్తుల ఆధారంగా సీనియారిటీ జాబితాను పరిశీలిస్తారు. 11 నుంచి 15 తేదీ వరకు బదలాయింపులపై జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు జరుగుతాయి. 15వ తేదీన సొంత జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ అవుతాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా అయిదు జిల్లాల్లో ఉద్యోగుల బదలాయింపులకు ఐచ్ఛికాలు ఇచ్చి ప్రక్రియను కొనసాగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా స్థాయి బదలాయింపుల అనంతరం జోనల్, బహుళ జోనల్ ఉద్యోగుల బదలాయింపులపై విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బుధవారం ఉత్తర్వులు జారీ కానున్నాయి. జోనల్, బహుళ జోనల్ బదిలీలపై పర్యవేక్షణకూ అధికారులను నియమిస్తారని తెలుస్తోంది.
* ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియపై సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. బుధవారం సాయంత్రంలోగా ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని శాఖలు, కలెక్టర్లు తమ తమ పరిధిలోని ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను సమర్పించాలని ఆదేశించారు. బదలాయింపులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలన్నారు.
* టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్లు సీఎస్ను కలిశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ ఐచ్ఛికాలు ఇస్తేనే బదిలీల్లో పరిపూర్ణత...
ప్రభుత్వం చేపడుతున్న జోనల్ బదిలీల్లో పలు కీలక అంశాలు, ఐచ్ఛికాలను చేర్చితేనే ఉద్యోగులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(ట్రెసా) సూచించింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు మంగళవారం ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్లతో కూడిన ప్రతినిధి బృందం సీఎస్ సోమేశ్కుమార్తో భేటీ అయింది. ఈ సందర్భంగా పలు అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జోనల్ బదిలీలపై చేసిన సూచనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చారని ట్రెసా ప్రతినిధులు తెలిపారు. వారు సూచించిన కీలకాంశాలు
* వివిధ కేడర్ల పోస్టులకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ బదిలీలకు ఉద్యోగులకు ఐచ్ఛికాలు ఇవ్వాలి.
* ప్రొఫార్మాలో స్పౌస్, పీహెచ్సీ (దివ్యాంగుల కోటా) కేటగిరి, మెడికల్ గ్రౌండ్స్ ఐచ్ఛికాలు తప్పనిసరిగా పొందుపర్చాలి.
* కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు 2016లో ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీలు చేసిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాతోపాటు ఉద్యోగంలో చేరాక మొదటి నియామక జిల్లా (ఎస్టాబ్లిష్మెంట్ జిల్లా)ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
* రెవెన్యూశాఖను బలోపేతం చేసేందుకు అవసరమైన గరిష్ఠ కేడర్ స్ట్రెంత్ను నిర్ధారించాలి.
* డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులు కల్పించాలి.
* డీపీసీ ఆమోదం పొంది తహసీల్దార్ల పోస్టింగ్ కోసం ఎదురుచూపుల్లో ఉన్న డీటీలకు పోస్టింగ్ ఇవ్వాలి.
* ప్రభుత్వ అవసరార్థం దూర ప్రాంతాల్లో నియమించిన ప్రొబెషనరీ డీటీలకు జిల్లాలకు బదిలీ అవకాశం కల్పించాలి.
* వీఆర్వోలకు బదిలీ ఐచ్ఛికం ఇవ్వాలి.
జోనల్ విధానంతో సంపూర్ణన్యాయం: శ్రీనివాస్గౌడ్
టీజీవోల సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు కొత్త జోనల్ విధానం ద్వారా సంపూర్ణన్యాయం జరుగుతుందని, సొంత జిల్లాల్లో, జోన్లలో శాశ్వతంగా పనిచేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప అవకాశం కల్పించారని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పక్కాగా, సకాలంలో పూర్తయ్యేందుకు టీజీవో, టీఎన్జీవో తదితర సంఘాలు సహకరించాలన్నారు. సర్దుబాటైన వెంటనే ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుందని తెలిపారు. టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. సంఘం బాధ్యులందరూ సభ్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ